రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆనందయ్య మందు ఇప్పుడో సంచలనంగా మారటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీసింది. ఏపీకి చెందిన నేతలు ఆనందయ్య మందుపై సానుకూలంగా స్పందిస్తున్నారు. అధికార.. విపక్షాలకు చెందిన నేతలంతా ఆయన మందుపై సానుకూల ప్రకటనలు చేసే విషయంలో పోటీ పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం సైతం ఆనందయ్య మందుపై శాస్త్రీయంగా లెక్క తేల్చే విషయంలో సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటోంది.
సానుకూల ఫలితాలు వస్తే.. టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మందును తయారు చేసేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలాంటివేళ.. ఆనందయ్య మందుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు. మిగిలిన వారికి భిన్నంగా జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
కృష్ణపట్నం ఆనందయ్య మందు కరోనాను నయం చేసేలా పని చేస్తే.. ఆయనకు పాదాభివందం చేస్తానని చెప్పారు. కళ్లల్లో ఆనందయ్య మందు వేస్తే కళ్లకు ప్రమాదమన్నారు. ఆ మందు వేస్తే కళ్లకు ప్రమాదం.. కళ్ల మంట తప్పించి కరోనా పోదన్నారు. ఆనందయ్య మందు పని చేస్తే కరోనా రోగులకు ఆ మందును పంపిణీ చేయొచ్చన్నారు. అనవసరమైన మూఢనమ్మకాలకు పోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీలో ఆనందయ్య మందుకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఇష్టపడని తీరుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉండటం విశేషం.
This post was last modified on May 28, 2021 11:03 am
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…