రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆనందయ్య మందు ఇప్పుడో సంచలనంగా మారటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీసింది. ఏపీకి చెందిన నేతలు ఆనందయ్య మందుపై సానుకూలంగా స్పందిస్తున్నారు. అధికార.. విపక్షాలకు చెందిన నేతలంతా ఆయన మందుపై సానుకూల ప్రకటనలు చేసే విషయంలో పోటీ పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం సైతం ఆనందయ్య మందుపై శాస్త్రీయంగా లెక్క తేల్చే విషయంలో సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటోంది.
సానుకూల ఫలితాలు వస్తే.. టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మందును తయారు చేసేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలాంటివేళ.. ఆనందయ్య మందుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు. మిగిలిన వారికి భిన్నంగా జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
కృష్ణపట్నం ఆనందయ్య మందు కరోనాను నయం చేసేలా పని చేస్తే.. ఆయనకు పాదాభివందం చేస్తానని చెప్పారు. కళ్లల్లో ఆనందయ్య మందు వేస్తే కళ్లకు ప్రమాదమన్నారు. ఆ మందు వేస్తే కళ్లకు ప్రమాదం.. కళ్ల మంట తప్పించి కరోనా పోదన్నారు. ఆనందయ్య మందు పని చేస్తే కరోనా రోగులకు ఆ మందును పంపిణీ చేయొచ్చన్నారు. అనవసరమైన మూఢనమ్మకాలకు పోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీలో ఆనందయ్య మందుకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఇష్టపడని తీరుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉండటం విశేషం.
This post was last modified on May 28, 2021 11:03 am
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…