Political News

ఆ రెండు బాధ్యతలు బాలయ్య చిన్నల్లుడుకేనా..!


రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీకి చాలా నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేని సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఒక్కసారిగా అధికారం కోల్పోయిన టీడీపీలో చాలామంది నాయకులు సైడ్ అయిపోయారు. పలువురు నాయకులు పార్టీ నుంచి జంప్ కొట్టేశారు. దీంతో రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకులు లేరు. ఇలా ఇన్‌చార్జ్‌లు లేని నియోజ‌క‌వ‌ర్గాలు 30 + ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన విశాఖపట్నం జిల్లాలో విశాఖ సౌత్, భీమిలి నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు కూడా లేరు.

గత ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. టీడీపీ తరుపున గెలిచిన గణేశ్, మొన్న ఆ మధ్య వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో సౌత్‌లో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. గణేశ్ టీడీపీని వీడాక చంద్రబాబు సౌత్‌లో ఇన్‌చార్జ్‌ని కూడా పెట్టలేదు. అటు కంచుకోటగా ఉన్న భీమిలి నియోజకవర్గంలో టీడీపీది అదే పరిస్థితి.

2019 ఎన్నికల్లో భీమిలి నుంచి సబ్బం హరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సబ్బం ఓడిపోయాక భీమిలి వైపు పెద్దగా వెళ్లలేదు. అయితే ఇటీవల ఆయన కరోనాతో మరణించారు. దీంతో భీమిలిలో మరో నాయకుడుని పెట్టాల్సిన అవసరముంది. భీమిలి, విశాఖ సౌత్ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జ్‌లని పెడితే మరింత బలం పుంజుకునే అవకాశముంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు నియోజకవర్గాల బాధ్యతలనీ విశాఖ పార్లమెంట్ ఇన్‌చార్జ్, బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ చూసుకుంటున్నారని తెలుస్తోంది.

ఆయ‌నే విశాఖ పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు విశాఖ పార్లమెంటు ప‌రిధిలో ఉన్నాయి. ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికలో రెండు నియోజకవర్గాల్లో నాయకులకు అండగా ఉన్నారు. అసలు సౌత్‌లో గణేశ్ వెళ్ళగానే, ఆ నియోజకవర్గంలో నాయకులతో సమావేశమై భరత్, పార్టీ మరీ వీక్ అవ్వకుండా చూసుకున్నారు. అటు భీమిలి నాయకులతో కూడా టచ్‌లో ఉన్నారని తెలిసింది. అందుకే కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ మంచి ఫలితాలే సాధించింది. కాబట్టి ఈ రెండు చోట్ల ఇన్‌చార్జ్‌లని పెడితే పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

This post was last modified on May 28, 2021 6:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

8 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago