Political News

ఎవరు ఎవరికి గాలమేస్తున్నారు ?

ఇపుడిదే విషయం అర్ధం కావటంలేదు. టీఆర్ఎస్ ఎంఎల్ఏ, మంత్రివర్గం నుండి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ విషయమే ఆసక్తిగా మారుతోంది. టీఆర్ఎస్ లో ఉంటునే భవిష్యత్తు అడుగులు ఎటు వేయాలనే విషయమై చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందు రాజ్యసభ ఎంపి డీ శ్రీనివాస్ లాంటి వారిని కలిశారు.

తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు కమలంపార్టీ స్ధానిక నేతలతో భేటీలు జరిపారు. ఒకదశలో పార్టీకి తాను రాజీనామా చేసేయబోతున్నట్లు ఈటల కలరింగ్ కూడా ఇచ్చారు. అయితే కరోనా ఉధృతి కారణంగా రాజీనామా చేయటం లేదని మద్దతుదారులు ప్రకటించారు. కొంతకాలం కేవలం మద్దతుదారులతో మాత్రమే మంతనాలు జరిపిన మాజీమంత్రి మళ్ళీ హఠాత్తుగా భేటీల స్పీడుపెంచారు.

ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ అయిన ఈటల సికింద్రాబాద్ ఎంపి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అండ్ కో తో భేటీ అవబోతున్నారు. ఈ విషయాన్ని కిషన్ కూడా ధృవీకరించారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు పార్టీలూ ఈటకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఇదే సమయంలో తన మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని మాజీమంత్రి ఏ సంగతి చెప్పకుండా దాటవేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈటలకు బలమైన పార్టీ అవసరముంది. అలాగే కాంగ్రెస్, బీజేపీలకు బలమైన బీసీ నేత అవసరముంది. దాంతో పార్టీలకు ఈటల అవసరముందా ? లేకపోతే ఈటలకే పార్టీ అవసరముందా ? అనే విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎవరు ఎవరికి గాలమేస్తున్నారనే విషయం అమోయంగా మారింది. చూద్దాం కొద్దిరోజుల్లోనే అయోమయం క్లియర్ అయిపోవచ్చేమో.

This post was last modified on May 28, 2021 6:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

44 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago