ఇపుడిదే విషయం అర్ధం కావటంలేదు. టీఆర్ఎస్ ఎంఎల్ఏ, మంత్రివర్గం నుండి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ విషయమే ఆసక్తిగా మారుతోంది. టీఆర్ఎస్ లో ఉంటునే భవిష్యత్తు అడుగులు ఎటు వేయాలనే విషయమై చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందు రాజ్యసభ ఎంపి డీ శ్రీనివాస్ లాంటి వారిని కలిశారు.
తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు కమలంపార్టీ స్ధానిక నేతలతో భేటీలు జరిపారు. ఒకదశలో పార్టీకి తాను రాజీనామా చేసేయబోతున్నట్లు ఈటల కలరింగ్ కూడా ఇచ్చారు. అయితే కరోనా ఉధృతి కారణంగా రాజీనామా చేయటం లేదని మద్దతుదారులు ప్రకటించారు. కొంతకాలం కేవలం మద్దతుదారులతో మాత్రమే మంతనాలు జరిపిన మాజీమంత్రి మళ్ళీ హఠాత్తుగా భేటీల స్పీడుపెంచారు.
ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ అయిన ఈటల సికింద్రాబాద్ ఎంపి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అండ్ కో తో భేటీ అవబోతున్నారు. ఈ విషయాన్ని కిషన్ కూడా ధృవీకరించారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు పార్టీలూ ఈటకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఇదే సమయంలో తన మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని మాజీమంత్రి ఏ సంగతి చెప్పకుండా దాటవేస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈటలకు బలమైన పార్టీ అవసరముంది. అలాగే కాంగ్రెస్, బీజేపీలకు బలమైన బీసీ నేత అవసరముంది. దాంతో పార్టీలకు ఈటల అవసరముందా ? లేకపోతే ఈటలకే పార్టీ అవసరముందా ? అనే విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎవరు ఎవరికి గాలమేస్తున్నారనే విషయం అమోయంగా మారింది. చూద్దాం కొద్దిరోజుల్లోనే అయోమయం క్లియర్ అయిపోవచ్చేమో.
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…