Political News

బెయిల్ రద్దు కేసు.. జగన్‌కు లాస్ట్ ఛాన్స్

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఐతే ఏమీ తేలకుండానే కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది.

కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. లాక్‌డౌన్‌ కారణంగా కౌంటర్‌ దాఖలు చేయలేకపోతున్నామని, అలాగే సీబీఐ నుంచి ఇంకా సూచనలు కూడా రాలేదని జగన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఐతే నిజంగా కౌంటర్‌ సిద్ధంగా ఉంటే లాక్ డౌన్‌తో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని.. మెయిల్‌ ద్వారా కూడా సమర్పించవచ్చని.. ఉద్దేశపూర్వకంగానే కౌంటర్ దాఖలు విషయంలో జాప్యం చేస్తూ రఘురామ మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది వెంకటేశ్‌ అన్నారు. కౌంటర్ దాఖలుకు మరోసారి గడువు ఇవ్వొద్దని.. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసు్తున్నందుకు జరిమానా విధించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. సీబీఐ ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు.

కాగా ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్‌, సీబీఐలకు చివరి అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణను జూన్‌ 1కి వాయిదా వేసింది. ఆ రోజున కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా బెయిల్ రద్దు కేసులో విచారణ చేపడతామని స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో విపరీతమైన జాప్యం జరుగుతోందని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామ పిటిషన్ వేయడం.. ఈ కేసు విచారణలో ఉండగా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా మాట్లాడుతున్నారంటూ రఘురామ మీద ఏపీ సీఐడీ పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సంచనలం రేపిన సంగతి తెలిసిందే.

This post was last modified on May 26, 2021 6:35 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

9 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

10 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

11 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

11 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

11 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

12 hours ago