Political News

గవర్నర్లను అడ్డం పెట్టుకుని మోడి ఇంతపని చేస్తున్నారా ?

గవర్నర్లపై ముఖ్యమంత్రుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గవర్నర్ జగదీప్ థడకర్ కు మధ్య వ్యవహారం ఉప్పునిప్పులాగ తయారైంది. తాజాగా మహారాష్ట్ర గవర్నర్ హోషియారీ వ్యవహారంపై శివసేన ప్రభుత్వం మండిపోతోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ ఎంపి సంజై రౌతు హోషియారీ పై తీవ్రంగా ధ్వజమెత్తటమే ఇందుకు నిదర్శనం.

గవర్నర్లను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ రాష్ట్రాల పై పెత్తనం చెలాయించాలని చూస్తోందనే ఆరోపణలు రోజు రోజుకు పెరిగిపోతోంది. తమ ఆటలు సాగని రాష్ట్రాల్లో గవర్నర్లను ముందు పెట్టుకుని వ్యవహారం నడిపిద్దామని మోడి చూస్తున్నారంటు మమత బెనర్జీ ఇప్పటికే నానా రచ్చ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉదంతం చూసిన తర్వాత మమత చేస్తున్న రచ్చ నిజమే అనిపిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే 12 మందిని ఎంఎల్సీలుగా నామినేట్ చేయాలంటు ముఖ్యమంత్రి దగ్గర నుండి పోయిన నవంబర్లో గవర్నర్ హోషియారీకి ఫైల్ చేరింది. మామూలుగా సీఎం దగ్గర నుండి ఫైల్ వస్తే గవర్నర్ ఒకటిరెండు రోజుల్లో సంతకాలు పెట్టి క్లియర్ చేసేస్తారు. అలాంటిది హోషియారీ ఆ ఫైల్ ను పోయిన నవంబర్ నుండి ఇప్పటివరకు క్లియర్ చేయకుండా అట్టే పెట్టేసుకున్నారు. ఈ విషయంలో రౌత్ మండిపోతు సదరు ఫైల్ పై గవర్నర్ ఏమన్నా పీహెచ్డీ చేస్తున్నారా అంటు ఎద్దేవా చేశారు.

బెంగాల్లో కూడా మమతతో సంబంధం లేకుండానే గవర్నర్ ధడకర్ తనిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. నారదా స్కాంలో నిందితులనే కారణంతో మమతకు చెప్పకుండానే ఇద్దరు మంత్రులపై సీబీఐ విచారణకు గవర్నర్ ఆర్డరేయటం పెద్ద దుమారాన్నే రేపుతోంది. గవర్నర్ ను అడ్డుపెట్టుకుని కేంద్రం బెంగాల్లో మమతను బాగా ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

ఇక పాండిచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు అక్కడి గవర్నర్ కిరణ్ బేడి దాదాపు సమాంతర ప్రభుత్వాన్నే నడిపారు. ప్రతిరోజు ముఖ్యమంత్రికి గవర్నర్ కు రచ్చే రచ్చ. అలాగే ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కాదని లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను అడ్డం పెట్టుకుని కేంద్రం సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇలాంటి రాజకీయాలు చేస్తోంది కాబట్టే మోడి సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనేతలు తెలుసుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

This post was last modified on May 25, 2021 8:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago