ఏపీలో విపక్ష టీడీపీ నుంచి ఎప్పుడు ఎవరు సైకిల్ దిగేస్తారో ? తెలియడం లేదు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఈ స్థాయిలో లేకపోయి ఉంటే కార్పొరేషన్, తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల దెబ్బకు ఎంతో మంది నేతలు, కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సైకిల్ దిగేసి ఉండేవారు. ఇప్పుడు ఈ లిస్టులోకే కేంద్ర మాజీ మంత్రి, తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిన పనబాక లక్ష్మి కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. పనబాక సైకిల్ దిగడం పక్కా.. అయితే డేటు, టైం ఒక్కటే ఫిక్స్ కావాల్సి ఉందంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు అయిష్టంగానే టీడీపీలో చేరి తిరుపతి ఎంపీగా పోటీ చేసిన పనబాక చిత్తుగా ఓడిపోయారు. మళ్లీ మొన్న ఉప ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు ఎంతో బతిమిలాడితే కాని ఆమె పోటీ చేయలేదు. వరుసగా రెండోసారి ఆమె ఘోరంగా ఓటమి పాలయ్యారు.
పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏ మాత్రం ఆశలు లేని నేతల లిస్టులో పనబాక కూడా చేరిపోయారు. పోనీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేద్దామంటే ఏ మాత్రం పార్టీకి కలిసి రాని తిరుపతి పార్లమెంటు బరిలో ఉన్నా మళ్లీ ఓడిపోక తప్పదనే నిర్ణయానికి ఆమె వచ్చేసినట్టు తెలుస్తోంది. అసలు 2019 నాటికే పనబాక అవుట్ డేటెడ్ అయిపోయారు. ఆమెకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తే సరిపోయేది. అలాంటి నేతనే మరోసారి గతిలేక సానుభూతి అస్త్రం కోసం బరిలోకి దింపి బలి పశువును చేశారు. వాస్తవానికి ఆమెకు 2019 ఎన్నికలకు ముందే వైసీపీ ఆఫర్ వచ్చినా వదులుకుని మరీ టీడీపీలోకి వచ్చారు.
ఇక తిరుపతి ఉప పోరులో లోకేష్ హైలెట్ కావడానికే అక్కడ ప్రచారం తంతు జరిగిందే తప్పా.. తన గెలుపుకోసం నిజంగా స్థానిక నేతలు, అటు పార్టీ అధిష్టానం ఎవ్వరూ మనస్సుపెట్టి పనిచేయలేదన్న ఆవేదనతో పనబాక ఉన్నారు. ఇక పనబాకకు నెల్లూరు జిల్లాలో కాస్తో కూస్తో మిగిలిన అనుచరులు సైతం ఆమెను టీడీపీలో ఉంటే మనకు భవిష్యత్తు ఉండదని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనే రెండుసార్లు వైసీపీ ఆఫర్ మిస్ చేసుకున్న ఆమె ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వెళితే అక్కడ పెద్దలు, నాయకులు ఆమెను ఆహ్వానిస్తారా ? అన్నది తెలియదు.
జగన్ నుంచి గ్రీన్సిగ్నల్ వస్తే మాత్రం పనబాక కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారట. అయితే పార్టీలో కొందరు ఎస్సీ ఎమ్మెల్యేలు మాత్రం ఆమె విషయంలో సుముఖంగా లేరని తెలుస్తోంది. మరి ఈ వయస్సులో పనబాక ఎలాంటి స్టెప్ వేస్తారో ? చూడాలి. మొత్తానికి సైకిల్ దిగేందుకు మాత్రం ఆమె రెడీ అయిపోయినట్టే ?
This post was last modified on May 26, 2021 8:51 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…