Political News

ఫుడ్ డెలివరీ రచ్చ.. రంగంలోకి కేటీఆర్

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ లో లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం ఫుడ్ డెలివరీని అత్యవసర సేవల్లో పరిగణించడం తెలిసిందే. దీంతో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలు గత ఏడాది లాక్ డౌన్ టైంలో మాదిరే ఇప్పుడూ పని చేస్తూ వచ్చాయి. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి.

హోటళ్లన్నీ మూత పడ్డ నేపథ్యంలో ఇంట్లో వంట వండుకునే సదుపాయం లేని వాళ్లకు ఇప్పుడు ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లే దిక్కు. మొన్నటిదాకా వీటికి ఏ ఆటంకమూ లేకపోయింది. ఫుడ్ డెలివరీ బాయ్స్ ఏ ఇబ్బందీ లేకుండా సేవలు అందించారు. కానీ శనివారం ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయాయి. హైదరాబాద్ సిటీలో అన్ని చోట్లా ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల బాయ్స్ మీద లాఠీఛార్జీలు కూడా చేశారు. దీని పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఎసెన్షియల్ సర్వీస్‌ల్లో ఫుడ్ డెలివరీని చేర్చి ఇప్పుడు ఉన్నట్లుండి డెలివరీ బాయ్స్‌ మీద ఈ జులుం ఏంటి అంటూ ప్రశ్నలు రేకెత్తాయి. కాగా జొమాటో, స్విగ్గీ సంస్థలు ఫుడ్ డెలివరీని ఆపేస్తున్నట్లుగా ప్రకటనలు చేశాయి. దీంతో వీటి మీదే ఆధారపడ్డ తమ పరిస్థితి ఏంటంటూ హైదరాబాద్ వాసులు సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు.

దీంతో కేటీఆర్ కూడా స్పందించక తప్పలేదు. ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను అడ్డుకోవడం పై తనకు అనేక ఫిర్యాదులు అందాయని.. దీని గురించి రాష్ట్ర డీజీపీతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా కేటీఆర్ ఇలా ట్వీట్ చేసిన కొన్ని గంటలకే డీజీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్లు పడ్డాయి. లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థలను కూడా ఆపాల్సి వచ్చిందని… దీనిపై సమీక్ష జరుపుతున్నామని పేర్కొన్నారు. దీనిపై ఆదివారం మరోసారి సమీక్ష జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సేవలను సోమవారం నుంచి పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on May 23, 2021 12:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

46 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago