ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు- నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కును నష్టాలు చూపిస్తూ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిన కాడికి అమ్మేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. దాదాపు 39 మంది ప్రాణ త్యాగంతో ఏర్పాటైన ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తారా ? అంటూ.. విశాఖ సహా ఏపీ మొత్తం మోడీపై దండెత్తింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కేంద్రం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గిన సందర్భం లేదు. ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని.. కేంద్ర మంత్రులు వరుస పెట్టి మరీ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పార్లమెంటుకు కూడా చెప్పారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో స్థానిక, కార్పొరేషన్ ఎన్నికలు రావడం.. తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు, నాయకులు.. కార్మికులకు అండగా నిలిచారు. అంతేకాదు.. వారి డిమాండ్ను ఢిల్లీ వరకు వినిపిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక, ఏపీ సీఎం జగన్.. శారదా పీఠానికి వెళ్లిన సమయంలో ఇక్కడి కార్మిక సంఘాలు.. విమానాశ్రయంలో సీఎం జగన్తో భేటీ అయి.. వారి సమస్యలు చెప్పుకొన్నారు. అంతేకాదు.. అసెంబ్లీలో తార్మానం చేయాలని కూడా డిమాండ్ చేశారు. వీరి డిమాండ్ను అమలు చేయడంతోపాటు కేంద్రానికి తాను లేఖ కూడా రాస్తానని జగన్ హామీ ఇచ్చారు.
అన్నట్టుగానే కొన్నాళ్ల కిందటే.. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. నష్టాల నుంచి ఎలా బయట పడొచ్చో వివరిస్తూ.. ప్రధానికి అనేక సూచనలు సైతం చేశారు. ఇక, ఇంతలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఊపేసింది. దీంతో భారీ ఎత్తున ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. దీంతో ఈ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ ను దేశవ్యాప్తంగా సరఫరా చేశారు. ఈ పరిణామాలతో అయినా..కేంద్ర ప్రభుత్వం విశాఖను ప్రైవేటీకరించకుండా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది.
ఇక, ఈ క్రమంలోనే తాజాగా ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన.. వైసీపీ ప్రభుత్వం.. బడ్జెట్ను ఆమోదించింది. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం గమనార్హం. ఈ పరిణామంతో.. జగన్ తాను ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు అయింది. మరి ఇక, మోడీ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on May 22, 2021 11:07 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…