20వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న పినరయి విజయన్ మంత్రివర్గం విషయంలో సీపీఎం కొత్త ప్రయోగం చేయబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తోంది. ఎల్డీఎఫ్ కూటమిలో సీపీఎం ప్రధాన భాగస్వామి. కూటమిలోని ఇతర పార్టీల సభ్యులను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు.
అయితే సీపీఎం తరపున మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నవారంతా కొత్తవారే. ఇప్పటివరకు మంత్రులుగా బాధ్యతలు చూసిన వారిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకూడదని సీపీఎం నిర్ణయించింది. ముఖ్యమంత్రిగా ఎవరుండాలి, మంత్రులుగా ఎవరుండాలనే విషయాన్ని కేరళలో సీపీఎం పార్టీయే నిర్ణయిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.
కొత్త మంత్రివర్గంలో సీపీఎం తరపున 12 మంది ప్రాతినిధ్యం వహించబోతున్నారు. మొత్తానికి 12మందిని కొత్తవారినే సీపీఎం పార్లమెంటరీ పార్టీ ప్రకటించింది. కరోనా వైరస్ సంక్షోభంలో కష్టపడి పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్న కేకే శైలజకు కూడా కొత్త మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కొత్తవారిని+యువతకు మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలన్న పార్టీ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ నేత ఏఎస్ షంసీర్ స్పష్టం చేశారు.
This post was last modified on May 19, 2021 3:35 pm
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…