Political News

బెంగాల్‌లో ఏం జ‌రుగుతోంది?


దేశ‌మంతా క‌రోనా మ‌హ‌మ్మారితో అల్లాడిపోతుంటే.. బెంగాల్‌లో మాత్రం ఈ వైర‌స్ క‌ల్లోలం కంటే రాజ‌కీయ ప‌ర‌మైన ర‌గ‌డే చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా దేశం దృష్టిని ఆక‌ర్షించిన అక్క‌డి రాజ‌కీయ వైరం.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కూడా స‌ద్దుమ‌ణ‌గ‌లేదు.

మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి రాగానే.. ప్రధాన ప్ర‌తిప‌క్షం బీజేపీకి చెందిన కార్య‌కర్త‌ల‌పై తీవ్ర స్థాయిలో దాడులు జ‌ర‌గ‌డం.. ఆ పార్టీ వాళ్లు దాదాపు ప‌దిమంది దాకా ప్రాణాలు కోల్పోవ‌డం తెలిసిందే. ఈ హింస ఇలా కొన‌సాగుతుండ‌గానే.. కేంద్ర ప్ర‌భుత్వం మ‌మ‌త స‌ర్కారును టార్గెట్ చేసింది. ఎప్ప‌ట్నుంచో నానుతున్న‌ నారద టేపుల వ్యవహారాన్ని మ‌ళ్లీ బ‌య‌టికి తీసింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న న‌లుగురు మంత్రులను సీబీఐ అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు టీఎంసీ కార్య‌క‌ర్త‌లు. సీబీఐ ఆఫీస్ ముందు అయితే ప‌రిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సీబీఐ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. మంత్రులను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సీబీఐ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.

నిబంధనలు పాటించకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తనను కూడా అరెస్టు చేయాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీబీఐ అరెస్టు చేసిన మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా బెనర్జీలతో సహా మరో ఇద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రులను అరెస్టు చేసిన ఏడు గంటల్లోనే కోర్టు బెయిలిచ్చింది.

This post was last modified on May 18, 2021 9:38 am

Share

Recent Posts

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

25 minutes ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

1 hour ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

1 hour ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

2 hours ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

4 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

9 hours ago