Political News

బెంగాల్‌లో ఏం జ‌రుగుతోంది?


దేశ‌మంతా క‌రోనా మ‌హ‌మ్మారితో అల్లాడిపోతుంటే.. బెంగాల్‌లో మాత్రం ఈ వైర‌స్ క‌ల్లోలం కంటే రాజ‌కీయ ప‌ర‌మైన ర‌గ‌డే చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా దేశం దృష్టిని ఆక‌ర్షించిన అక్క‌డి రాజ‌కీయ వైరం.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కూడా స‌ద్దుమ‌ణ‌గ‌లేదు.

మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి రాగానే.. ప్రధాన ప్ర‌తిప‌క్షం బీజేపీకి చెందిన కార్య‌కర్త‌ల‌పై తీవ్ర స్థాయిలో దాడులు జ‌ర‌గ‌డం.. ఆ పార్టీ వాళ్లు దాదాపు ప‌దిమంది దాకా ప్రాణాలు కోల్పోవ‌డం తెలిసిందే. ఈ హింస ఇలా కొన‌సాగుతుండ‌గానే.. కేంద్ర ప్ర‌భుత్వం మ‌మ‌త స‌ర్కారును టార్గెట్ చేసింది. ఎప్ప‌ట్నుంచో నానుతున్న‌ నారద టేపుల వ్యవహారాన్ని మ‌ళ్లీ బ‌య‌టికి తీసింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న న‌లుగురు మంత్రులను సీబీఐ అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు టీఎంసీ కార్య‌క‌ర్త‌లు. సీబీఐ ఆఫీస్ ముందు అయితే ప‌రిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సీబీఐ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. మంత్రులను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సీబీఐ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.

నిబంధనలు పాటించకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తనను కూడా అరెస్టు చేయాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీబీఐ అరెస్టు చేసిన మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా బెనర్జీలతో సహా మరో ఇద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రులను అరెస్టు చేసిన ఏడు గంటల్లోనే కోర్టు బెయిలిచ్చింది.

This post was last modified on May 18, 2021 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

5 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

6 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

6 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

8 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

8 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

10 hours ago