Political News

బెంగాల్‌లో ఏం జ‌రుగుతోంది?


దేశ‌మంతా క‌రోనా మ‌హ‌మ్మారితో అల్లాడిపోతుంటే.. బెంగాల్‌లో మాత్రం ఈ వైర‌స్ క‌ల్లోలం కంటే రాజ‌కీయ ప‌ర‌మైన ర‌గ‌డే చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా దేశం దృష్టిని ఆక‌ర్షించిన అక్క‌డి రాజ‌కీయ వైరం.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కూడా స‌ద్దుమ‌ణ‌గ‌లేదు.

మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి రాగానే.. ప్రధాన ప్ర‌తిప‌క్షం బీజేపీకి చెందిన కార్య‌కర్త‌ల‌పై తీవ్ర స్థాయిలో దాడులు జ‌ర‌గ‌డం.. ఆ పార్టీ వాళ్లు దాదాపు ప‌దిమంది దాకా ప్రాణాలు కోల్పోవ‌డం తెలిసిందే. ఈ హింస ఇలా కొన‌సాగుతుండ‌గానే.. కేంద్ర ప్ర‌భుత్వం మ‌మ‌త స‌ర్కారును టార్గెట్ చేసింది. ఎప్ప‌ట్నుంచో నానుతున్న‌ నారద టేపుల వ్యవహారాన్ని మ‌ళ్లీ బ‌య‌టికి తీసింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న న‌లుగురు మంత్రులను సీబీఐ అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు టీఎంసీ కార్య‌క‌ర్త‌లు. సీబీఐ ఆఫీస్ ముందు అయితే ప‌రిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సీబీఐ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. మంత్రులను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సీబీఐ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.

నిబంధనలు పాటించకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తనను కూడా అరెస్టు చేయాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీబీఐ అరెస్టు చేసిన మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా బెనర్జీలతో సహా మరో ఇద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రులను అరెస్టు చేసిన ఏడు గంటల్లోనే కోర్టు బెయిలిచ్చింది.

This post was last modified on May 18, 2021 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీ ప్రమోషన్ – సూర్య మీద నాని డామినేషన్

మే 1 విడుదలవుతున్న రెండు సినిమాలు హిట్ 3 ది థర్డ్ కేస్, రెట్రో దేనికవే ప్రత్యేక అంచనాలతో ప్రేక్షకుల…

52 minutes ago

జైలుకు వెళ్లాలని పీఎస్ఆర్ కోరుకున్నారా?

ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో అరెస్టైన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి.సీతారామాంజనేయులు…

55 minutes ago

చిరు – ఓదెల : బయోపిక్ రేంజ్ బొమ్మ!

విశ్వంభర సంగతేమో కానీ చిరంజీవి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎగ్జైటింగ్ ప్రాజెక్టుల్లో ముందు వరసలో ఉన్న సినిమా దర్శకుడు శ్రీకాంత్…

2 hours ago

మే1.. ఇండస్ట్రీలే ఎదురు చూస్తున్నాయ్

పీక్ సమ్మర్లో థియేటర్లు జనాల్లేక వెలవెలబోతుండడం పట్ల టాలీవుడ్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. వేరే ఇండస్ట్రీల పరిస్థితి కూడా ఏమంత…

3 hours ago

పహల్గామ్‌ ఉగ్రదాడి.. TRF వెనకున్నది ఎవరు?

పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడి వెనుక ఉన్నది తామేనంటూ TRF (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ప్రకటించుకోవడంతో, ఈ సంస్థ మళ్లీ…

4 hours ago

వామ్మో… ‘ఫౌజీ’ మీద అంత బడ్జెట్టా?

ప్రభాస్ సినిమా అంటే చాలు.. వందల కోట్ల బడ్జెట్, అంతకుమించిన బిజినెస్ మామూలైపోయింది. ప్రభాస్ ఈ మధ్య చేసిన వాటిలో…

9 hours ago