Political News

బెంగాల్‌లో ఏం జ‌రుగుతోంది?


దేశ‌మంతా క‌రోనా మ‌హ‌మ్మారితో అల్లాడిపోతుంటే.. బెంగాల్‌లో మాత్రం ఈ వైర‌స్ క‌ల్లోలం కంటే రాజ‌కీయ ప‌ర‌మైన ర‌గ‌డే చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా దేశం దృష్టిని ఆక‌ర్షించిన అక్క‌డి రాజ‌కీయ వైరం.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కూడా స‌ద్దుమ‌ణ‌గ‌లేదు.

మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి రాగానే.. ప్రధాన ప్ర‌తిప‌క్షం బీజేపీకి చెందిన కార్య‌కర్త‌ల‌పై తీవ్ర స్థాయిలో దాడులు జ‌ర‌గ‌డం.. ఆ పార్టీ వాళ్లు దాదాపు ప‌దిమంది దాకా ప్రాణాలు కోల్పోవ‌డం తెలిసిందే. ఈ హింస ఇలా కొన‌సాగుతుండ‌గానే.. కేంద్ర ప్ర‌భుత్వం మ‌మ‌త స‌ర్కారును టార్గెట్ చేసింది. ఎప్ప‌ట్నుంచో నానుతున్న‌ నారద టేపుల వ్యవహారాన్ని మ‌ళ్లీ బ‌య‌టికి తీసింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న న‌లుగురు మంత్రులను సీబీఐ అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు టీఎంసీ కార్య‌క‌ర్త‌లు. సీబీఐ ఆఫీస్ ముందు అయితే ప‌రిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సీబీఐ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. మంత్రులను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సీబీఐ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.

నిబంధనలు పాటించకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తనను కూడా అరెస్టు చేయాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీబీఐ అరెస్టు చేసిన మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా బెనర్జీలతో సహా మరో ఇద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రులను అరెస్టు చేసిన ఏడు గంటల్లోనే కోర్టు బెయిలిచ్చింది.

This post was last modified on May 18, 2021 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago