మూడు రోజుల క్రితం అరెస్టయిన వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు సొంత సామాజికవర్గంలోనే ఒంటరైపోయారు. గెలిచిన పార్టీ నేతలతోనే గొడవలు పెట్టుకోవటం వల్ల, ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై నోటకొచ్చినట్లు మాట్లాడటం వల్ల అధికారపార్టీ నేతలకు దూరమైపోయారు. ఇక అరెస్టు తర్వాత మరీ విచిత్రమైన పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విచిత్రం ఏమిటంటే అధికారపార్టీ ఎంపికి ప్రతిపక్షాల నేతలందరు మద్దతుగా నిలబడటం. తిరుగుబాటు ఎంపి వైఖరి తప్పా ? ఒప్పా ? అన్న విషయాన్ని పక్కనపెట్టేసి ఏకపక్షంగా అందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడబలుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. సరే రాజకీయాలన్నాక ఇలాగే ఉంటాయని సరిపెట్టుకుందాం కాసేపు.
అయితే ఇంతటి క్లిష్టపరిస్ధితుల్లో కృష్ణంరాజుకు మద్దతుగా నిలబడుతుందని అనుకున్న సొంత సామాజికవర్గం కూడా వదిలేసింది. రఘురామ వైఖరితో, అరెస్టుతో సామాజికవర్గానికి ఎలాంటి సంబంధం లేదని క్షత్రియ సామాజికవర్గ సమాఖ్య స్పష్టంగా ప్రకటించింది. భీమవరం, గణపవరం, తణుకు, ఉండి, తిరుపతి లాంటి పట్టణాల్లోని క్షత్రియ సంఘాలు రఘురామ వ్యవహారానికి సామాజికవర్గానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు అత్యంత సన్నిహితంగా ఉన్న రాజకీయ కుటుంబాల ప్రముఖులు కూడా ఇప్పటివరకు నోరెత్తలేదు. మాజీ ఎంపిలు కనుమూరు బాపిరాజు, గోకరాజు గంగరాజు, కృష్ణంరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త సిరీస్ రాజు కుటుంబం ఎవరు కూడా ఎంపికి మద్దతుగా మాట్లాడలేదు. అంటే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూసిన తర్వాత ఎంపి సామిజికవర్గంలో ఒంటరైపోయినట్లు అర్ధమవుతోంది.
This post was last modified on May 17, 2021 10:59 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…