అధికారికంగా శుక్రవారం మార్కెట్లోకి వచ్చిన రష్యా తయారీ స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారీ టార్గెట్ నే పెట్టుకున్నది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రెడ్డీ ల్యాబరేటరీతో ఒప్పందం చేసుకున్న రష్యన్ ఫార్మాకంపెనీ స్పుత్నిక్ వి రెడ్డి ల్యాబరేటరీ ఉన్నతాధికారి మొదటిడోసు ఇంజక్షన్ తీసుకున్నారు. రష్యా నుండి టీకాలు మొదటి బ్యాచ్ కింద 1.5 లక్షల డోసులు వచ్చాయి.
ప్రస్తుతం యావత్ దేశం టీకాల కొరతతో ఇబ్బందులు పడుతున్న సమయంలో స్పుత్నిక్ వీ టీకా దేశంలో లాంచ్ అవటం సుభపరిణామమనే చెప్పాలి. దేశవ్యాప్తంగా అందరికీ టీకాలు వేయాలంటే 260 కోట్ల డోసులు అవసరం. అయితే ఇపుడు కో వ్యాగ్జిన్ అయినా కోవీషీల్డ్ అయినా నెలకు అవుతున్న ఉత్పత్తి సుమారు 8 కోట్లు మాత్రమే. ఈ లెక్కన దేశానికంతటికీ రెండు డోసుల టీకాలు వేయాలంటే సుమారు ఏడాది పడుతుందని అంచనా.
ఈ నేపధ్యంలోనే స్పుత్నిక్ యాజమాన్యం భారీ టార్గెట్ తో దేశంలోకి అడుగుపెట్టింది. ఏడాది మొత్తానికి 85 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నది. అంటే సగటున నెలకు 7 కోట్ల డోసులను ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు క్లినికల్ ట్రయల్స్ జరిపిన అన్నీ వ్యాక్సిన్లతో పోల్చుకుంటే స్పుత్నిక్ టీకా 90 శాతం సక్సెస్ రేటు సాధించినట్లు సమాచారం. సో స్పుత్నిక్ తో పాటు ఇతర కంపెనీలు కూడా పోటీపడి టీకాలు తయారుచేస్తే జనాలందరు హ్యాపీగా ఉంటారు.
This post was last modified on May 15, 2021 3:20 pm
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…