అధికారికంగా శుక్రవారం మార్కెట్లోకి వచ్చిన రష్యా తయారీ స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారీ టార్గెట్ నే పెట్టుకున్నది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రెడ్డీ ల్యాబరేటరీతో ఒప్పందం చేసుకున్న రష్యన్ ఫార్మాకంపెనీ స్పుత్నిక్ వి రెడ్డి ల్యాబరేటరీ ఉన్నతాధికారి మొదటిడోసు ఇంజక్షన్ తీసుకున్నారు. రష్యా నుండి టీకాలు మొదటి బ్యాచ్ కింద 1.5 లక్షల డోసులు వచ్చాయి.
ప్రస్తుతం యావత్ దేశం టీకాల కొరతతో ఇబ్బందులు పడుతున్న సమయంలో స్పుత్నిక్ వీ టీకా దేశంలో లాంచ్ అవటం సుభపరిణామమనే చెప్పాలి. దేశవ్యాప్తంగా అందరికీ టీకాలు వేయాలంటే 260 కోట్ల డోసులు అవసరం. అయితే ఇపుడు కో వ్యాగ్జిన్ అయినా కోవీషీల్డ్ అయినా నెలకు అవుతున్న ఉత్పత్తి సుమారు 8 కోట్లు మాత్రమే. ఈ లెక్కన దేశానికంతటికీ రెండు డోసుల టీకాలు వేయాలంటే సుమారు ఏడాది పడుతుందని అంచనా.
ఈ నేపధ్యంలోనే స్పుత్నిక్ యాజమాన్యం భారీ టార్గెట్ తో దేశంలోకి అడుగుపెట్టింది. ఏడాది మొత్తానికి 85 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నది. అంటే సగటున నెలకు 7 కోట్ల డోసులను ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు క్లినికల్ ట్రయల్స్ జరిపిన అన్నీ వ్యాక్సిన్లతో పోల్చుకుంటే స్పుత్నిక్ టీకా 90 శాతం సక్సెస్ రేటు సాధించినట్లు సమాచారం. సో స్పుత్నిక్ తో పాటు ఇతర కంపెనీలు కూడా పోటీపడి టీకాలు తయారుచేస్తే జనాలందరు హ్యాపీగా ఉంటారు.
This post was last modified on May 15, 2021 3:20 pm
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…