అలాగే అనిపిస్తోంది వ్యవహారం చూస్తుంటే. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో పాటు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత కారణంగా పెరిగిపోయిన వ్యతిరేకత వల్ల మోడి పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. దాంతో మొన్నటి వరకు జమిలి ఎన్నికల విషయంలో మోడి వెనక్కు తగ్గినట్లేనా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దేశంలో జమిలి ఎన్నికల నిర్వహించాలనే విషయంలో నరేంద్రమోడి ఎంత ఆసక్తిచూపారో అందరికీ తెలిసిందే. పార్లమెంటు-రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వేటికవే విడివిడిగా నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయని మి భావించారు. పార్లమెంటు ఎన్నికల్లో జనాలు మోడికి ఓటేస్తున్నా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ప్రాంతీయపార్టీలవైపే మొగ్గుచూపుతున్నారని అనుకున్నారు.
దేశమంతా బీజేపీ ఏలుబడిలోకి రావాలంటే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే జనాలంతా బీజేపీకే ఓట్లేస్తారని మోడి బలంగా అనుకుంటున్నారు. అయితే ఐదురాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పడిన ఓట్లతో పాటు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో జనాల వ్యతిరేకతను చూసిన తర్వాత అసలు జమిలి ఎన్నికల ఊసే ఎత్తటంలేదు.
అన్నీ అనుకూలంగా ఉంటే 2022-23 లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా జమిలి ఎన్నికల నిర్వహణకు రెడీ అని చెప్పేసింది. ఎలాగైనా జమిలి ఎన్నికలను నిర్వహించాలన్న ఉద్దేశ్యంతోనే మోడి నుండి ప్రభుత్వం+పార్టీలోని కీలక నేతలంతా దాదాపు 80 సమావేశాలను నిర్వహించరు. జమిలి కోసం అంతగా ఊగిపోయిన మోడి అండ్ కో ఇపుడు అసలు ఆ ప్రస్తావనే తేవటంలేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత జమిలిపై మోడి వెనక్కు తగ్గినట్లే అనుకుంటున్నారు.
This post was last modified on May 14, 2021 12:11 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…