అలాగే అనిపిస్తోంది వ్యవహారం చూస్తుంటే. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో పాటు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత కారణంగా పెరిగిపోయిన వ్యతిరేకత వల్ల మోడి పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. దాంతో మొన్నటి వరకు జమిలి ఎన్నికల విషయంలో మోడి వెనక్కు తగ్గినట్లేనా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దేశంలో జమిలి ఎన్నికల నిర్వహించాలనే విషయంలో నరేంద్రమోడి ఎంత ఆసక్తిచూపారో అందరికీ తెలిసిందే. పార్లమెంటు-రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వేటికవే విడివిడిగా నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయని మి భావించారు. పార్లమెంటు ఎన్నికల్లో జనాలు మోడికి ఓటేస్తున్నా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ప్రాంతీయపార్టీలవైపే మొగ్గుచూపుతున్నారని అనుకున్నారు.
దేశమంతా బీజేపీ ఏలుబడిలోకి రావాలంటే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే జనాలంతా బీజేపీకే ఓట్లేస్తారని మోడి బలంగా అనుకుంటున్నారు. అయితే ఐదురాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పడిన ఓట్లతో పాటు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో జనాల వ్యతిరేకతను చూసిన తర్వాత అసలు జమిలి ఎన్నికల ఊసే ఎత్తటంలేదు.
అన్నీ అనుకూలంగా ఉంటే 2022-23 లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా జమిలి ఎన్నికల నిర్వహణకు రెడీ అని చెప్పేసింది. ఎలాగైనా జమిలి ఎన్నికలను నిర్వహించాలన్న ఉద్దేశ్యంతోనే మోడి నుండి ప్రభుత్వం+పార్టీలోని కీలక నేతలంతా దాదాపు 80 సమావేశాలను నిర్వహించరు. జమిలి కోసం అంతగా ఊగిపోయిన మోడి అండ్ కో ఇపుడు అసలు ఆ ప్రస్తావనే తేవటంలేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత జమిలిపై మోడి వెనక్కు తగ్గినట్లే అనుకుంటున్నారు.
This post was last modified on May 14, 2021 12:11 pm
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…
ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…