రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. సామాన్యుడు మొదలు సెలబ్రిటీల వరకూ అందరికి హైదరాబాద్ లో ఏదో ఒక పని తప్పనిసరి. ఉద్యోగం.. వ్యాపారం.. వ్యక్తిగత పనులు.. ఇలా ఏదో ఒక కారణంతో హైదరాబాద్ కు వస్తూ పోవటం తెలిసిందే. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన లాక్ డౌన్ మాటతో ఎక్కడి వారుఅక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అత్యవసరమో.. అనారోగ్యమో.. లేదంటే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారిని చూసేందుకు అప్పటికప్పుడు ఈ పాస్ తీసుకొని వెళ్లటం తెలిసిందే.
అలా కాకుండా హైదరాబాద్ లో చిక్కుకుపోయిన వారిని ఏపీకి తరలించే కార్యక్రమం ఇప్పటివరకూ షురూ కాలేదు. హైదరాబాద్ లో ఉండిపోయిన ఆంద్రా ప్రాంతానికి చెందిన 13వేల మంది (హైదరాబాద్ జిల్లాలో ఐదు వేలు.. రంగారెడ్డిజిల్లాలో ఏడు వేలు) ఈ – దరఖాస్తులు ఏపీ పోలీసుల వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇంతమందికి ప్రైవేటు వాహనాల్లో ఏపీకి వచ్చేందుకు వీలుగా అనుమతుల్ని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సుల్ని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు తిప్పాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మరో రెండు రోజుల్లో ఆన్ లైన్ లో రిజర్వేషన్లు కూడా చేపడతారని చెబుతున్నారు. ఈ బస్సులు హైదరాబాద్ లోని మియాపూర్.. కేపీహెచ్ బీ.. లక్డీకాఫూల్.. ఎల్ బీ నగర్ మీదుగా ఏపీకి వెళతాయి.
ఈ తరలింపు ప్రక్రియ సాఫీగా సాగితే.. రానున్న కొద్ది రోజుల్లో చెన్నై.. బెంగళూరుల్లో చిక్కకుపోయిన ఆంధ్రోళ్లను కూడా బస్సుల్లో తీసుకు వస్తారని చెబుతున్నారు. అయితే.. ఏపీకి వెళ్లినంతనే పద్నాలుగు రోజుల క్వారంటైన్ కు ఓకే చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో చిక్కుకున్న ఆంధ్రోళ్లకు ఈ వార్త పండుగలాంటి వార్తగా చెప్పక తప్పదు.
This post was last modified on May 14, 2020 6:40 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…