Political News

రుయాసుపత్రిలో చనిపోయింది ఎంతమంది ?

ఘటన జరిగి 48 గంటలు అయిపోయినా రుయా ఆసుపత్రిలో చనిపోయింది ఎంతమంది అనే విషయమై జాబితా వెల్లడికాకపోవటమే విచిత్రంగా ఉంది. మామూలుగా దుర్ఘటన జరిగిన వెంటనే మృతుల జాబితాతో పాటు ఇతరత్రా వివరాలను అధికారయంత్రాంగం ప్రకటించేస్తుంది. అయితే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి సంఖ్యను ప్రకటించిన జిల్లా కలెక్టర్ జాబితాను మాత్రం విడుదల చేయకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

ఘటన జరగ్గానే 11 మంది చనిపోయినట్లు కలెక్టర్ హరినారాయణ్ ప్రకటించారు. అంతే మళ్ళీ వాళ్ళ వివరాలను ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదో అర్ధం కావటంలేదు. ఇదే సమయంలో కలెక్టర్ ప్రకటనకు భిన్నంగా ఆసుపత్రిలో చనిపోయిన వారిసంఖ్య 56 మందని కొందరు చెబుతున్నారు. అయితే ఇక్కడో చిన్న మెలికుంది. అదేమిటంటే ఆ అర్ధగంటలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారిసంఖ్య 11 మాత్రమే అని అయితే ఆ తర్వాత అదే రోజు చనిపోయిన వారితో కలుపుకుంటే సంఖ్య 56కి చేరుకుందని చెబుతున్నారు.

ఇక్కడే ఉన్నతాధికారుల్లో అయోమయం మొదలైందట. ఇంతకీ ఆక్సిజన్ అందక చనిపోయిన వారికి ఇచ్చే కాజ్ ఆఫ్ డెత్ లో ఏమని రాయాలి ? అనే సమస్య మొదలైందట. కాజ్ ఆఫ్ డెత్ అన్నచోట ఆక్సిజన్ అందక అని రాస్తే రాసినవాళ్ళందరికీ భారీగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సుంటుంది. ఎందుకంటే దుర్ఘటనలో చనిపోయినవారికి నష్టపరిహారంగా రు.10 లక్షలు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

కాజ్ ఆఫ్ డెత్ ఒకటే అన్నపుడు నష్టపరిహారం 11 మందికే ఎలా ఇస్తారు ? చనిపోయిన వారికందరికీ ఇవ్వాల్సిందే అని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీపార్టీల రంగప్రవేశంతో కుటుంబసభ్యుల డిమాండ్లు మరింత గట్టిగా వినబడుతోంది. ఇలాంటి అనేక సాంకేతికసమస్యల కారణంగానే చనిపోయినవారి వివరాలను 48 గంటల తర్వాత కూడా ప్రకటించలేకపోతున్నట్లు సమాచారం. మరి చివరకు ఏమి చేస్తారో చూడాల్సిందే.

This post was last modified on May 13, 2021 10:31 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

11 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

12 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

13 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

13 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

13 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

14 hours ago