Political News

పరీక్షలు లేవు.. పదో తరగతి విద్యార్థులందరూ పాస్

స్కూళ్లలో ఇంతకుముందు ఏడో తరగతికి పబ్లిక్ పరీక్షలుండేవి. వాటిలో పాసైతేనే తర్వాతి తరగతికి ప్రమోట్ చేసేవాళ్లు. ఐతే చాలామంది అక్కడితో చదువు ఆపేస్తున్నారని ఏడో తరగతికి పబ్లిక్ పరీక్షలు ఆపేశారు. ఇప్పుడు స్కూల్ స్థాయిలో పదో తరగతికి మాత్రమే పబ్లిక్ పరీక్షలున్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాల్సిందే. ఇంటర్లో చేరాలంటే ఈ పరీక్షల్లో పాసవ్వాల్సిందే. కానీ కరోనా వైరస్ ధాటికి ఈ ఏడాది దేశంలో ఎక్కడా పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం లేకపోయింది.

మార్చి ద్వితీయార్ధం నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా సరిగ్గా అప్పుడే లాక్ డౌన్ మొదలైంది. కొన్ని రాష్ట్రాల్లో రెండు మూడు పరీక్షలు నిర్వహించి బ్రేక్ వేశారు. చాలా రాష్ట్రాల్లో అసలు ఒక్క పరీక్ష కూడా మొదలు కాలేదు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా.. పరీక్షలు ఎప్పుడు మొదలుపెడదామా అని చూస్తున్నారు.

కానీ లాక్ డౌన్‌ను నాలుగోసారి కూడా పొడిగించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తుండటం.. రాష్ట్రాలు కూడా పొడిగింపుకే మొగ్గు చూపుతుండటంతో పరీక్షల నిర్వహణ కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచాం. ఈ ఏడాదికి పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ తర్వాతి తరగతికి ప్రమోట్ చేయాలని నిర్ణయించిందట.

పరీక్షలు, ఆ తర్వాత ఫలితాల కోసం నెల రోజుల సమయం పడుతుంది. మే నెలలో అయితే పరీక్షలకు అవకాశమే లేదు. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో జూన్‌లో కూడా పరిస్థితి మారుతుందా అన్నది సందేహమే. మరీ ఆలస్యమైతే వచ్చే విద్యా సంవత్సరానికి ఇబ్బంది.

దీంతో పదో తరగతి పరీక్షలు రద్దు చేయడమే మేలని ఛత్తీస్ గఢ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే మొత్తం అందరినీ ప్రమోట్ చేయకుండా ఇది వరకు రాసిన క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రి ఫైనల్ పరీక్షల ఫలితాల్ని ప్రామాణికంగా తీసుకుని కొందరు విద్యార్థులకు బ్రేక్ వేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

This post was last modified on May 14, 2020 11:26 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

3 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

4 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

7 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

7 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

8 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

8 hours ago