బహిరంగ వేదికల్లో, ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నపుడు కొన్నిసార్లు మాట తడబడటం సహజం. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇలా ఎక్కువగా తడబడుతుంటారు. మంచి వక్తలుగా పేరున్న వాళ్లకు కూడా ఇలాంటి తడబాట్లు తప్పవు. కానీ ఒక నాయకుడు కొన్నిసార్లు అలా తడబడ్డపుడు ఒక ముద్ర వేసి వ్యతిరేక ప్రచారం చేయడం చూస్తుంటాం. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ.. తెలుగు రాష్ట్రాల వరకు వస్తే నారా లోకేష్ ఇలా టార్గెట్ అయిన వాళ్లే. వాళ్లు బహిరంగ వేదికల్లో, ప్రెస్ మీట్లలో మాట్లాడిన కొన్ని సందర్భాల్లో తడబడ్డారు. ఇంకేముంది ప్రత్యర్థులు అవి పట్టుకుని చెలరేగిపోయారు.
జాతీయ స్థాయిలో రాహుల్కు, మన దగ్గర లోకేష్కు ‘పప్పు’ అనే ముద్ర వేసేశారు. వాళ్లకు అసలు విషయ పరిజ్నానమే లేనట్లుగా ప్రొజెక్ట్ చేసి సామాజిక మాధ్యమాల్లో దారుణంగా ట్రోల్ చేసి వ్యక్తిత్వ హననం చేయడం తెలిసిందే.
ఐతే ఇలా ఏ పార్టీల వాళ్లు అయితే టార్గెట్ చేశారో.. అదే పార్టీల ముఖ్య నేతలు కూడా మీడియా ముందు, బహిరంగ వేదికల్లో మాట్లాడేటపుడు తడబడటం అందరూ చూశారు. ముఖ్యంగా లోకేష్ను టార్గెట్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు జగన్ తప్పులు కనిపించవు. ముఖ్యమంత్రి అయ్యాక గత రెండేళ్లలో జగన్ ప్రెస్ మీట్లలో పాల్గొనట్లేదు. మీడియా వాళ్లు లేకుండా ఆయనొక్కరే కూర్చుని చెప్పాలనుకున్న విషయం చెబుతున్నారు. మీడియా ప్రెజర్ లేకున్నా సరే.. గత ఏడాది కాలంలో జగన్ ఎన్నోసార్లు తడబడ్డ సంగతి తెలిసిందే.
తాజాగా తిరుపతి రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కొన్ని నిమిషాల వ్యవధిలో 11 మంది మృత్యువాత పడిన ఉదంతం గురించి జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ విషాదం గురించి వివరిస్తూ.. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రావడంలో ఆలస్యం జరిగింది అనడానికి బదులు అంబులెన్స్ ట్యాంకర్ రావడంలో ఆలస్యం జరిగిందని జగన్ చెప్పడం గమనార్హం. ఇదే మాట నారా లోకేష్ అని ఉంటే వైకాపా వాళ్లు దాన్నెంత రచ్చ చేసేవారో అంచనా వేయొచ్చు. ఐతే ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జగన్ వ్యాఖ్యల వీడియో పెట్టి ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on May 12, 2021 8:52 am
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…