128 సంవత్సరాల తర్వాత తొలిసారి తిరుమల భక్తుల లేకుండా బోసిపోయింది. ఆలయం మూసివేయలేదు గాని భక్తులను మాత్రం ఎవరినీ అనుతించలేదు. కరోనా కారణంగా బంధువులే అంటరాని వాళ్లయిపోయిన నేపథ్యంలో నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల ఆలయ దర్శన భాగ్యం మార్చి నుంచి పూర్తిగా బంద్ అయ్యింది. త్వరలో ప్రత్యేక దర్శన ప్రణాళికతో భక్తులకు స్వామి వారి తలుపులు తెరవనున్నారు.
అయితే, మునుపటి వాతావరణం ఉండదు. బుకింగ్ ఉన్న వారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తారు. అలిపిరి వద్దే చెకింగ్ చేసి దర్శనం టిక్కెట్ ఉన్నవారికే కొండపైకి అనుమతి ఉంటుంది. ఇకపై గంటకు 500 మంది చొప్పున కేవలం 14 గంటలు మాత్రమే దర్శనం కల్పిస్తారు.
తిరుమల ఉద్యోగులకు తొలుత దర్శనం కల్పిస్తారు. మూడు రోజుల పాటు దీనిని పరీక్షిస్తారు. అనంతరం కొద్దిరోజులు స్థానికులకు మాత్రమే అంటే తిరుమల, తిరుపతి, చిత్తూరు ప్రజలకు దర్శనం కల్పిస్తారు. తర్వాత దశలో అందరికీ దర్శన భాగ్యం ఉంటుంది.
నిత్యకళ్యాణం పచ్చతోరణంలా వెలిగిపోయిన తిరుమల కరోనా కాటుకు వెలవెలబోయింది. ఇపుడున్న జనరేషన్లో ఎవరూ ఇలా ఖాళీగా తిరుమలను చూడలేదు. కరోనా వల్ల అది కూడా చూశాం. అంటే ఇక నుంచి చాలా అరుదుగా స్వామి వారి దర్శనం దొరుకుతుంది. అది కూడా అదృష్టం అన్నమాట.
This post was last modified on May 14, 2020 6:39 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…