జువారి సిమెంట్స్ ప్లాంట్ మూసివేత వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టు పెద్ద షాకేఇచ్చింది. వాతావరణ కాలుష్యానికి కారణం అవుతోందని కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో ఉన్న జువారి సిమెంట్ ప్లాంటును ప్రభుత్వం వారంరోజుల క్రింద మూయించేసిన విషయం తెలిసిందే. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలకు వ్యతిరేకంగా ప్లాంట్ యాజమాన్యం హైకోర్టులో పిటీషన్ వేసింది. అన్నీ వివరాలను పరిశీలించిన కోర్టు మూసివేత నిర్ణయం చెల్లదంటూ స్పష్టంచేసింది.
వాతావరణ కాలుష్యం నియంత్రణకు తమ ప్లాంటు ఇఫ్పటికే అనేక చర్యలు తీసుకున్నట్లు యాజమాన్యం చెప్పింది. మరిన్ని చర్యలు తీసుకోవటానికి కూడా తమ ప్లాంటు రెడీగా ఉందని చెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదని యాజమాన్యం తన పిటీషన్లో స్పష్టంచేసింది. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునేందుకు కంపెనీకి అవకాశం ఇవ్వకుండా ప్లాంటును ఏకంగా మూసేయటం ఏమిటని ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.
కంపెనీకి ప్రభుత్వం చర్యలు తీసుకన్న కారణంగా ప్లాంటులో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇదే సమయంలో ఏడాదికి 13 వేల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంటు మూతపడింది. నిజానికి వాతావరణ కాలుష్య నియంత్రణకు ప్లాంటుకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సింది. కరోనా వైరస్ నేపధ్యంలో వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించిన ఫ్యాక్టరీని మూయించేయటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు.
This post was last modified on May 6, 2021 10:46 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…