జువారి సిమెంట్స్ ప్లాంట్ మూసివేత వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టు పెద్ద షాకేఇచ్చింది. వాతావరణ కాలుష్యానికి కారణం అవుతోందని కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో ఉన్న జువారి సిమెంట్ ప్లాంటును ప్రభుత్వం వారంరోజుల క్రింద మూయించేసిన విషయం తెలిసిందే. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలకు వ్యతిరేకంగా ప్లాంట్ యాజమాన్యం హైకోర్టులో పిటీషన్ వేసింది. అన్నీ వివరాలను పరిశీలించిన కోర్టు మూసివేత నిర్ణయం చెల్లదంటూ స్పష్టంచేసింది.
వాతావరణ కాలుష్యం నియంత్రణకు తమ ప్లాంటు ఇఫ్పటికే అనేక చర్యలు తీసుకున్నట్లు యాజమాన్యం చెప్పింది. మరిన్ని చర్యలు తీసుకోవటానికి కూడా తమ ప్లాంటు రెడీగా ఉందని చెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదని యాజమాన్యం తన పిటీషన్లో స్పష్టంచేసింది. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునేందుకు కంపెనీకి అవకాశం ఇవ్వకుండా ప్లాంటును ఏకంగా మూసేయటం ఏమిటని ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.
కంపెనీకి ప్రభుత్వం చర్యలు తీసుకన్న కారణంగా ప్లాంటులో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇదే సమయంలో ఏడాదికి 13 వేల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంటు మూతపడింది. నిజానికి వాతావరణ కాలుష్య నియంత్రణకు ప్లాంటుకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సింది. కరోనా వైరస్ నేపధ్యంలో వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించిన ఫ్యాక్టరీని మూయించేయటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు.
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…