Political News

‘బద్వేలు’ కు కరోనా దెబ్బ

కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లే. వైసీపీ ఎంఎల్ఏ డాక్టర్ జీ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. నిబందనల ప్రకారం సభ్యుడు మరణంతో ఖాళీ అయిన స్ధానంలో ఆరుమాసాల్లోగా ఉపఎన్నిక జరపాలి. ఈ లెక్కన సెప్టెంబర్ 28వ తేదీలోగా ఎన్నిక జరగాల్సుంది. అయితే హఠాత్తుగా వచ్చి మీదపడిన కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి కారణంగా ఉపఎన్నిక నిర్వహణ సాధ్యంకాదని కేంద్ర ఎన్నికల కమీషన్ తేల్చేసింది.

ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు అంతకుముందు జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే అక్కడక్కడ జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల కారణంగా కరోనా వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయిందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే కోర్టులు కూడా ఇదే అభిప్రాయంతో ప్రభుత్వాలపై అనేక రూపాల్లో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

మొన్ననే జరిగిన ఐదురాష్ట్రాల్లో గెలుపే టార్గెట్ గా లాక్ డౌన్ విధించటం కానీ, ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయలేకపోయినందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ పై సుప్రింకోర్టుతో పాటు తమిళనాడు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. పెరిగిపోతున్న కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నియంత్రణకు ప్రభుత్వాలన్నీ నానా అవస్తలు పడుతున్నాయి.

జరుగుతున్న డెవలప్మెంట్లను దృష్టిలో పెట్టుకునే బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక నిర్వహణను నిరవధికంగా వాయిదా వేయాలని కమీషన్ నిర్ణయించింది. కరోనా వైరస్ పరిస్దితులన్నీ చక్కబడిన తర్వాతే ఉపఎన్నిక నిర్వహణ గురించి ఆలోచించాలని తేల్చేసింది. మొత్తానికి కోర్టులు ఘాటుగా వ్యాఖ్యలు చేసిన తర్వాత కానీ కమీషన్ కు తత్వం బోధపడలేదన్నమాట.

Satya

Recent Posts

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

27 minutes ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

1 hour ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

2 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

3 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

3 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

4 hours ago