కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లే. వైసీపీ ఎంఎల్ఏ డాక్టర్ జీ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. నిబందనల ప్రకారం సభ్యుడు మరణంతో ఖాళీ అయిన స్ధానంలో ఆరుమాసాల్లోగా ఉపఎన్నిక జరపాలి. ఈ లెక్కన సెప్టెంబర్ 28వ తేదీలోగా ఎన్నిక జరగాల్సుంది. అయితే హఠాత్తుగా వచ్చి మీదపడిన కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి కారణంగా ఉపఎన్నిక నిర్వహణ సాధ్యంకాదని కేంద్ర ఎన్నికల కమీషన్ తేల్చేసింది.
ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు అంతకుముందు జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే అక్కడక్కడ జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల కారణంగా కరోనా వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయిందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే కోర్టులు కూడా ఇదే అభిప్రాయంతో ప్రభుత్వాలపై అనేక రూపాల్లో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
మొన్ననే జరిగిన ఐదురాష్ట్రాల్లో గెలుపే టార్గెట్ గా లాక్ డౌన్ విధించటం కానీ, ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయలేకపోయినందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ పై సుప్రింకోర్టుతో పాటు తమిళనాడు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. పెరిగిపోతున్న కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నియంత్రణకు ప్రభుత్వాలన్నీ నానా అవస్తలు పడుతున్నాయి.
జరుగుతున్న డెవలప్మెంట్లను దృష్టిలో పెట్టుకునే బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక నిర్వహణను నిరవధికంగా వాయిదా వేయాలని కమీషన్ నిర్ణయించింది. కరోనా వైరస్ పరిస్దితులన్నీ చక్కబడిన తర్వాతే ఉపఎన్నిక నిర్వహణ గురించి ఆలోచించాలని తేల్చేసింది. మొత్తానికి కోర్టులు ఘాటుగా వ్యాఖ్యలు చేసిన తర్వాత కానీ కమీషన్ కు తత్వం బోధపడలేదన్నమాట.
This post was last modified on May 6, 2021 10:41 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…