ప్రపంచానికి గుది బండలా మారిన మాయదారి వైరస్ మీద ఉన్న వాదనలు అన్ని ఇన్ని కావు. ఇది సహజసిద్ధంగా పుట్టిందా? ల్యాబుల్లో పుట్టిందా? అన్న దానిపై ఇప్పటికే పలువురు పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా భారత్ పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇంత జరుగుతున్నా.. వైరస్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడని పరిస్థితి.
ఇలాంటివేళ.. సంచలన వ్యాఖ్యలు చేశారు నితిన్ గడ్కరీ. కరోనా వైరస్ సహజసిద్ధంగా పుట్టుకొచ్చింది కాదని.. ల్యాబుల్లో పెరిగినట్లుగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు వచ్చిన సందేహాలే.. అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి కూడా వచ్చాయన్న మాటను గడ్కరీ ప్రస్తావించటం గమనార్హం.
వైరస్ ను ల్యాబుల్లో ప్రయోగిం వల్లనే ఇప్పుడున్న పరిస్థితి ఏర్పడిందని.. ఇలాంటిది ఒకటి వస్తుందని తాము కలలో కూడా ఊహించలేదన్నారు. సాక్ష్యాత్తు కేంద్రమంత్రి నోటి నుంచి వచ్చిన సందేహంలో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
కరోనా కట్టడిని ఎక్కువకాలం ఆపలేమన్న చేదు వాస్తవాన్ని ఆయన చెప్పేశారు. ఎక్కువకాలం లాక్ డౌన్ ను కొనసాగిన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు తథ్యమని చెప్పక తప్పదు.
This post was last modified on May 14, 2020 2:14 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…