ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో కల్లోలం రేపుతోందో తెలిసిందే. గత ఏడాది ఫస్ట్ వేవ్ వచ్చినపుడు ఒక రోజుకు గరిష్ట కేసుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య వెయ్యికి చేరితేనే వామ్మో వాయ్యో అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు రోజుకు 4 లక్షల దాకా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు 3-4 వేల మధ్య ఉంటున్నాయి. ఇవి అధికారికంగా చెబుతున్న లెక్కలు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు. గత ఏడాదితో పోలిస్తే వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఇందుకు కారణం.. ప్రస్తుత కరోనా వైరస్ వేరియంట్ చాలా ప్రమాదకరంగా ఉండటమే అంటున్నారు నిపుణులు. ఈ వేరియంట్ బయటపడింది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో అని, దేశంలో ప్రస్తుతం కరోనా ప్రభావం ఇంతగా పెరిగిపోవడానికి కారణం కూడా ఈ వేరియెంటే అని మీడియాలో వార్తలొస్తుండటం గమనార్హం. జాతీయ మీడియాలోనూ దీని గురించి చర్చ జరుగుతోంది. ఇంతకుముందు బయటపడ్డ కరోనా వేరియెంట్లలో బీ-1.617, బీ-2.618 అత్యంత ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. వాటిని మించి కొత్తగా బయటపడ్డ కరోనా స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమైందిగా పేర్కొంటున్నారు.
గత వేరియెంట్లతో పోలిస్తే ఇది 10-15 రెట్లు అధికంగా విస్తరించే సామర్థ్యం కలిగినదని.. ఏపీ తెలంగాణల్లో విపరీతంగా కేసులు పెరిగిపోవడానికి ఈ వేరియెంటే కారణమని.. అదే దేశమంతా పాకిపోయి కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోవడానికి కారణమైందని అంటున్నారు. దీన్ని ‘ఏపీ స్ట్రెయిన్’గా పేర్కొంటుండం.. జాతీయ స్థాయిలో దాని గురించి చర్చ జరుగుతుండటం గమనార్హం. ఐతే ఏపీ అధికారులు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఏపీలో కొత్త వేరియెంట్ లాంటిదేమీ బయటపడలేదని అంటున్నారు. దీనిపై నిపుణులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
This post was last modified on May 5, 2021 7:58 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…