లాక్ డౌన్ వేళ వలస కార్మికుల కష్టం చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాక మానవు. ఉన్న చోట పని లేక, తిండి, వసతి కొరవడి.. ఈ కష్టం ఎందుకులే అని సొంతూళ్లకు తరలి వెళ్లిపోతున్నారు కార్మికులు. ఐతే ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో వందల కిలోమీటర్లు నడిచి అయినా వెళ్లిపోవడానికి సిద్ధమైపోయారు ఎంతోమంది.
తమ సామాను నెత్తిన పెట్టుకుని.. పిల్లల్ని సైతం నడిపించుకుంటూ వందల కిలోమీటర్లు సాగిపోతున్నారు. ఈ క్రమంలో అలసి సొలసి.. ఒళ్లు హూనం అయిపోయి.. తిండి దొరక్క వాళ్లు పడుతున్న కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. చిన్న చిన్న పిల్లలు ఆకలితో రోడ్ల మీద అలమటిస్తున్న.. కాళ్ల నొప్పులు భరించలేక బోరున విలపిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయ. వీళ్ల కష్టాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాను కదిలిస్తున్నాయి.
కాగా ఓ వలస కార్మికుడు తాను కష్టపడ్డా.. తన భార్య, బిడ్డలు ఇబ్బంది పడొద్దని ఓ చిన్న ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న తోపుడు బండిని తయారు చేసుకున్నాడు. దాని మీద భార్యతో పాటు తన బిడ్డను కూడా కూర్చోబెట్టాడు. ముందు ఇనుప హ్యాండిల్ పట్టుకుని లాక్కుంటూ వెళ్లాడు. ఇలా ఏకంగా అతను 700 కిలోమీటర్ల దూరం వెళ్లడం గమనార్హం.
హైదరాబాద్లో ప్రయాణం ఆరంభించి మధ్య ప్రదేశ్లోని బాలా ఘాట్ వరకు అతను ప్రయాణం సాగించాడు. మధ్యలో తిండికి ఇబ్బంది పడ్డా ప్రయాణం మాత్రం ఆపలేదు. ఏకంగా 17 రోజుల పాటు ఇలా ప్రయాణం చేసి అతను స్వస్థలానికి చేరాడు. మామూలుగా నడవడమే కష్టం అంటే ఎండలో ఇలా బండిని లాక్కుంటూ వెళ్లడానికి అతనెంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దయనీయ వీడియోలు మరెన్నో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
This post was last modified on May 14, 2020 1:42 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…