లాక్ డౌన్ వేళ వలస కార్మికుల కష్టం చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాక మానవు. ఉన్న చోట పని లేక, తిండి, వసతి కొరవడి.. ఈ కష్టం ఎందుకులే అని సొంతూళ్లకు తరలి వెళ్లిపోతున్నారు కార్మికులు. ఐతే ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో వందల కిలోమీటర్లు నడిచి అయినా వెళ్లిపోవడానికి సిద్ధమైపోయారు ఎంతోమంది.
తమ సామాను నెత్తిన పెట్టుకుని.. పిల్లల్ని సైతం నడిపించుకుంటూ వందల కిలోమీటర్లు సాగిపోతున్నారు. ఈ క్రమంలో అలసి సొలసి.. ఒళ్లు హూనం అయిపోయి.. తిండి దొరక్క వాళ్లు పడుతున్న కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. చిన్న చిన్న పిల్లలు ఆకలితో రోడ్ల మీద అలమటిస్తున్న.. కాళ్ల నొప్పులు భరించలేక బోరున విలపిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయ. వీళ్ల కష్టాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాను కదిలిస్తున్నాయి.
కాగా ఓ వలస కార్మికుడు తాను కష్టపడ్డా.. తన భార్య, బిడ్డలు ఇబ్బంది పడొద్దని ఓ చిన్న ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న తోపుడు బండిని తయారు చేసుకున్నాడు. దాని మీద భార్యతో పాటు తన బిడ్డను కూడా కూర్చోబెట్టాడు. ముందు ఇనుప హ్యాండిల్ పట్టుకుని లాక్కుంటూ వెళ్లాడు. ఇలా ఏకంగా అతను 700 కిలోమీటర్ల దూరం వెళ్లడం గమనార్హం.
హైదరాబాద్లో ప్రయాణం ఆరంభించి మధ్య ప్రదేశ్లోని బాలా ఘాట్ వరకు అతను ప్రయాణం సాగించాడు. మధ్యలో తిండికి ఇబ్బంది పడ్డా ప్రయాణం మాత్రం ఆపలేదు. ఏకంగా 17 రోజుల పాటు ఇలా ప్రయాణం చేసి అతను స్వస్థలానికి చేరాడు. మామూలుగా నడవడమే కష్టం అంటే ఎండలో ఇలా బండిని లాక్కుంటూ వెళ్లడానికి అతనెంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దయనీయ వీడియోలు మరెన్నో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
This post was last modified on May 14, 2020 1:42 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…