Political News

బ్రేకింగ్‌: మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి క‌న్నుమూత‌

ఏపీలో విశాఖ‌ప‌ట్నం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, సీనియ‌ర్ నాయ‌కుడు.. రాజ‌కీయ విశ్లేష‌కుడు.. స‌బ్బం హ‌రి క‌న్నుమూశారు.. గ‌డిచిన 15 రోజులుగా ఆయ‌న క‌రోనాతో పోరాడుతున్నారు. క‌రోనా సోక‌డంతో ఆయ‌న విశాఖ‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, నాలుగు రోజుల కింద‌టే ఆయ‌న ఆరోగ్యం విష‌మించింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. మ‌రింత మెరుగైన వైద్యం అందించ‌డంతో అప్ప‌ట్లో కోలుకున్నారు. కానీ, తాజాగా 24 గంట‌లుగా మ‌ళ్లీ ఆయ‌న ఆరోగ్యం విష‌మించింది.

ఈ నేప‌థ్యంలో స‌బ్బం హ‌రి క‌న్నుమూసిన‌ట్టు వైద్యులు తెలిపారు. కాగా, రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందిన హ‌రి.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ప‌నిచేశారు. ఈ క్ర‌మంలోనే అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న 2009లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అంత‌కుముందు.. విశాఖ‌ప‌ట్నం మేయ‌ర్‌గా కూడా స‌బ్బం ప‌నిచేశారు. అయితే.. అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న స‌బ్బం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు.

స‌మైక్య ఉద్య‌మంలో పాల్గొని పోరాటం చేశారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీతోనూ విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో ఏ పార్టీ త‌ర‌ఫునా ఆయ‌న పోటీ చేయ‌కుండా త‌ట‌స్థంగా ఉండిపోయారు. ఇక‌, గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరిన హ‌రి.. ఎమ్మెల్యేగా భీమిలి నుంచి పోటీ చేశారు. అయితే.. వైసీపీ అభ్య‌ర్థి, ప్ర‌స్తుత మంత్రి ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాస్‌పై ఓడిపోయారు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న రాజ‌కీయాల‌పై విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు.

వాస్త‌వానికి ఆదిలో ఆయ‌న‌కు వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని.. అంటారు. కానీ, స‌బ్బం హ‌రి మాత్రం.. ఎన్న‌డూ ఆ పార్టీ జోలికి వెళ్ల‌లేదు. అదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేయ‌డంలోను, ఆ పార్టీ నేత‌ల అక్ర‌మాల‌ను బ‌య‌ట పెట్ట‌డంలోనూ హ‌రి ఎప్పుడూ ముందుండ‌డం గ‌మ‌నార్హం. కాగా.. స‌బ్బ‌హ‌రి మృతి ప‌ట్ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆపార్టీ నేత‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

Satya

Recent Posts

కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్… ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…

28 minutes ago

స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శలో ఎందుకీ రచ్చ?

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…

1 hour ago

వంద దేవుళ్ళు కలిసి హిట్ ఇస్తారా

వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…

1 hour ago

టాక్సిక్ చుట్టూ వలయం బిగుస్తోంది

అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…

3 hours ago

స్లమ్ డాగ్ … పూరి కొత్త మార్కు

దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…

5 hours ago

విశాఖ స్టీల్‌: ఆది నుంచి ప్ర‌మాద‌పుటంచునే

ఆంధ్రుల హ‌క్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడ‌ల‌ను ఏకం చేసిన ఉద్య‌మం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు క‌ర్మాగారం.. గ‌త రెండు…

8 hours ago