ఎన్నికల వ్యూహకర్త అన్న పదానికి సరికొత్త ఇమేజ్ తీసుకురావటమే కాదు.. తాను అందించే సేవల కోసం కొమ్ములు తిరిగిన రాజకీయ అధినేతలు సైతం వెయిట్ చేసే సత్తా ఆయన సొంతం. మాటల్లో మాత్రమే కాదు చేతల్లోనూ చేసి చూపిస్తానన్న విషయాన్ని పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలతో మరోసారి ప్రూవ్ చేశారు. తన నోటి నుంచి ఏదైనా మాట వచ్చినా.. సవాలు విసిరినా.. గురి తప్పని రీతిలో లక్ష్యాన్ని చేధించే మేజిక్ ను ఆయన బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మరోసారి ప్రదర్శించారు.
పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో బీజేపీ ఎంతలా ప్రయత్నించినా.. ఆ పార్టీ రెండు అంకెల స్థానాలకు మించి సాధించలేదన్నారు. అంతేకాదు.. వంద సీట్ల కంటే ఎక్కువ సీట్లను సొంతం చేసుకుంటే.. తాను ట్విటర్ నుంచి శాశ్వితంగా వీడుతానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను చెప్పింది చెప్పినట్లు జరిగిన దానికి భిన్నంగా.. పశ్చిమ బెంగాల్ తీర్పుభిన్నంగా వస్తుందని.. పీకేకు ఎదురుదెబ్బ తప్పదన్న మాట బలంగా వినిపించింది. అయినప్పటికి ఆయన అలాంటి వ్యాఖ్యలకు స్పందించలేదు. తాను గతంలో చెప్పిన దానికే కట్టుబడి ఉంటానని చెప్పారు.
ఆయన చెప్పినట్లే తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడటం.. అధికారానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు చచ్చి చెడీ అనే రీతిలో వస్తుందన్న పరిశీలకుల అంచనాకు భిన్నంగా.. ఎవరూ ఊహించని రీతిలో సీట్లను డబుల్ సెంచురీ దాటించేసిన మమత.. తన మేజిక్ ను ప్రదర్శించారు.
బెంగాల్ ఎన్నికల అనంతరం ఎగిరేది కాషాయ జెండా అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసిన బీజేపీకి బెంగాలీ ఓటర్లు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు. ఆ పార్టీ కేవలం 83 స్థానాల్లోనే తన సత్తా చాటింది (ఇప్పటివరకువెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే.. నాలుగుస్థానాల్లో గెలుపు.. 79 స్థానాల్లో అధిక్యతలో ఉంది) తుది ఫలితం మరింత తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గత డిసెంబరులో పీకే చేసిన సవాలుకు తగ్గట్లే తాజా ఫలితం ఉండటంతో.. ప్రశాంత్ కిశోర్ ఛరిష్మా మరింతలా పెరిగిపోతుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on May 2, 2021 5:56 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…