తిరుపతిలో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమై పోయింది. దాదాపు 65 శాతం ఓటు బ్యాంకుతో వైసీపీ విజయం సాధిస్తుందని.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం దక్కించుకుంటారని ఎగ్జిట్ పోల్ ఫలితం వచ్చింది. అయితే.. ఇదే జరిగితే.. వైసీపీలో మార్పులు వస్తాయా ? పార్టీలో ఎలాంటి మార్పులు ఉంటాయి? ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుందా ? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే. పార్టీ పుంజుకునే పరిస్థితి లేకపోతే.. బయటకు వచ్చే నాయకులు ఉన్నారు.
అలాగని.. పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే పరిస్థితి ఉంటుందా? అంటే కష్టమే. ఎందుకంటే.. పార్టీకి సంస్థాగతంగా ఉన్న ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని సీనియర్లు పార్టీ మారే అవకాశం లేదు. పైగా.. వైసీపీలోకి వెళ్లిపోతే.. వారికి లభించే గుర్తింపు ఏంటో ఇప్పటికే పార్టీ మారిన నేతల వల్ల.. స్పష్టంగా కనిపిస్తోంది. సో.. పార్టీ మారితే.. వీరికి అంతకు మించిన గుర్తింపు దక్కే అవకాశం లేదు. ఇప్పటికే ఇలా మారిన వారు కూడా వైసీపీలో ఇమడలేక పోతున్నారు. స్థానికంగా బలంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు.. వీరిమధ్య తీవ్ర వివాదాలు, విభేదాలు అంతర్గతంగా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా పార్టీమారినా.. వారికి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. సో.. పార్టీలోనే ఉంటారని అంటున్నారు పరిశీలకులు. పైగా మరో రెండేళ్లు ఓర్చుకుంటే.. ఎన్నికల సమయానికి టీడీపీ వ్యూహాత్మకంగా జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని సంకేతాలు వస్తున్నాయి. తిరుపతిలో కనుక బీజేపీకి పెను దెబ్బతగిలితే విధిలేని పరిస్థితిలో అయినా.. టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యే పరిస్థితి ఉంది. దీంతో మళ్లీ టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. తిరుపతి ఫలితం ఒక్కటే టీడీపీ నేతలను డిసైడ్ చేయలేదని అంటున్నారు పరిశీలకులు.
కొందరు టీడీపీ నేతలు తిరుపతి ఉప ఎన్నిక ఫలితం, మెజార్టీ తర్వాత టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నా.. వైసీపీలో పరిస్థితులు చూసుకుని గమ్మనుండడం మినహా చేసేదేం ఉండడం లేదు.
This post was last modified on May 2, 2021 10:59 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…