Political News

బాబు.. సీనియ‌ర్టీ టీడీపీకి ప‌నిచేయ‌డం లేదా ?


టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు తాను నోరు విప్పితే.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటారు. అంతేకాదు.. త‌న‌క‌న్నా సీనియ‌ర్ నేత ఈ దేశంలో ఎవ‌రూ లేర‌ని కూడా చెబుతారు. మ‌రి ఆయ‌న సీనియార్టీ పార్టీ కోసం ఏమేర‌కు ఉపయోగ ప‌డుతోంది? ఏమేర‌కు పార్టీని న‌డిపించేందుకు చంద్ర‌బాబు వ్యూహాలు ప‌నిచేస్తున్నాయి? అంటే.. ఏమీ లేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా బాబు వ్యూహాలు ఏదీ కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. తాజాగా కూడా ఆయ‌న వ్యూహ లేమి స్ప‌ష్టంగా క‌నిపించింది.

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో పోలింగ్ రోజు.. అధికార పార్టీ నేత‌లు దొంగ ఓట్ల దందా కు తెర‌దీశార‌ని.. ఎక్క‌డెక్క‌డి నుంచో వేలాది మంది ఓట‌ర్ల‌ను త‌ల‌రించి.. దొంగ ఓట్లు వేయించార‌ని పెద్ద ఎత్తున చంద్ర‌బాబు ఆరోపించారు. దీనికి సంబంధించిన ప‌లు వీడియో ఆధారాల‌ను కూడా ఆయ‌న చూపించారు. వైసీపీ స‌ర్కారుపైనా.. వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌పైనా తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఇక‌, పార్టీ అభ్య‌ర్థి కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మితో ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని.. లేదా ఫ‌లితం ప్ర‌క‌టించ‌కుండా నిలుపుదల చేయాల‌ని కోరుతూ.. హైకోర్టులో పిటిష‌న్ వేయించారు.

దీంతో హైకోర్టుకు వెళ్ల‌డాన్ని టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేసుకున్నారు. ఇదంతా కూడా త‌మ అధినేత ముందు చూపుతో చేసిందేన‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున‌.. దీనికి క‌వ‌రేజ్ కూడా ఇచ్చింది. ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపున‌కు రెండు రోజుల ముందు ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చింది అయితే.. విచార‌ణ‌కు సేక‌రించిన రెండు నిముషాల‌లోనే టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇది నేరుగా హైకోర్టును ఆశ్ర‌యించే కేసు కాద‌ని.. ‘ఎన్నిక‌ల పిటిష‌న్‌’ వేయాల‌ని.. ఇప్ప‌టికే స‌మ‌యం మించిపోయింద‌ని.. పేర్కొంది. దీంతో క‌నీసం ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలియ‌దా ? అంటున్నారు నెటిజ‌న్లు.

ఇన్నేళ్లు రాజ‌కీయాల్లో ఉన్న చంద్ర‌బాబుకు ఎన్నిక‌ల పిటిష‌న్‌కు సాధార‌ణ పిటిష‌న్‌కు తేడా తెలియ‌క‌పోతే ఎలా? అనే కామెంట్లు వ‌స్తున్నాయి. మ‌రి నిజ‌మే క‌దా? అదే.. ఇప్ప‌టికే ఎన్నిక‌ల పిటిష‌న్ దాఖ‌లు చేసి ఉంటే.. ప‌రిస్థితి ఎలా ఉండేదో అని పార్టీ సీనియ‌ర్లు కూడా అనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు పిటిష‌న్ దాఖ‌లు చేసేందుకు స‌మ‌యం మించిపోయింద‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఇలాంటి ప‌రిణామాలు వ‌చ్చిన‌ప్పుడు బాబు త‌న సీనియార్టీని వినియోగించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.

This post was last modified on May 2, 2021 10:45 am

Share
Show comments

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

1 hour ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

3 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

3 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

4 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

5 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

6 hours ago