ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరిగినా యావత్ దేశం దృష్టిమాత్రం పశ్చిమబెంగాల్ పైనే ఉంది. హై ఓల్టేజీ పవర్ తో జరిగిన హోరా హోరీలో విచిత్రమైన పరిస్ధితి కనబడుతోంది. బెంగాల్లో మమతాబెనర్జీ-నరేంద్రమోడి మధ్య ప్రచారం హోరాహారీగా జరిగింది. కౌంటింగ్ మొదలైన తర్వాత వెలువడిన మెజారిటిలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏమిటంటే బీజేపీ మీద తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటితో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మమత మాత్రం వెనకబడ్డారు.
బెంగాల్లో ఎన్నికలు ఒకఎత్తు మమత పోటీ చేసిన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకెత్తు అన్నట్లుగా సాగింది ఎన్నికలు. ఎందుకంటే మమతను ఎలాగైనా ఓడించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వయం చాలా ప్లాన్లే వేసింది. ఇందులో భాగంగానే దశాబ్దాలుగా మమతకు కుడిభుజంగా ఉన్న సుబేందు అధికారిని బీజేపీలోకి లాగేసుకున్నారు. సుబేందు సంవత్సరాల తరబడి నందిగ్రామ్ నుండి గెలుస్తునే ఉన్నారు.
అంటే నందిగ్రామ్ ప్రాంతంలో సుబేందు అధికారి కుటుంబానికి తిరుగులేదనే చెప్పాలి. ఇలాంటి నియోజకవర్గంలో తనపై పోటీచేసి గెలవాలని సుబేందు చాలెంజ్ చేయగానే మమత రెడీ అనేశారు. ఎన్నో ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్న భరత్ పూర్ ను కాదని మమత నందిగ్రామ్ లో పోటీచేశారు. దాంతో ఈ నియోజకవర్గం ప్రచారంలో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి.
ఎలాగైనా మమతను ఓడించాలని మోడి+అమిత్+సుబేందు సర్వశక్తులు ఒడ్డారు. కౌంటింగ్ మొదలైన తర్వాత రెండు రౌండ్లలో మమత 4500 ఓట్లతో వెనకబడుంది. తాను పోటీచేస్తే పరిస్ధితి ఏమిటనే విషయాన్ని మమత సర్వే చేయించుకోకుండానే దూకారా అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు. విచిత్రమేమిటంటే రాష్ట్రంలో మెజారిటి సీట్లలో టీఎంసీ లీడ్లలో ఉంటే వ్యక్తిగతంగా మమత మాత్రం వెనకబడుంటం. అయ్యింది ఇప్పటికి రెండు రౌండ్లే. జరగాల్సిన రౌండ్లు చాలానే ఉన్నాయి. కాబట్టి ఇపుడే ఏమీ చెప్పలేని స్ధితి. అందుకనే నందిగ్రామ్ పై సర్వత్రా ఆసక్తి పెరిగిపోతోంది.
This post was last modified on May 2, 2021 10:35 am
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…