అవును తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో సంబరాలు అప్పుడే మొదలైపోయాయి. ఎన్నికలకు ముందునుండే డీఎంకే అధికారంలోకి వస్తుందని మీడియా సంస్ధల సర్వేల్లో వెల్లడైంది. ఆ సర్వేల్లో ఏ సంస్ధలో కూడా ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని పొరబాటున కూడా రిజల్టు రాలేదు. దానికి తగ్గట్లే ఎగ్జిట్ పోలింగ్ సర్వేలో కూడా అన్నీ సంస్ధలు కూడా అధికారం డీఎంకేదే అని బల్లగుద్ది మరీ చెప్పేశాయి.
దాంతో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తో పాటు సీనియర్ నేతలంతా హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోయారు. దానికి తగ్గట్లే శనివారం నుండి డీఎంకే ఆఫీసుతో పాటు జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో సంబరాలు మొదలైపోయాయి. స్టాలినే కాబోయే సీఎం అనే ప్రచారం మొదలైపోయేసరికి అధికారయంత్రాంగంలో కూడా మార్పొచ్చేసింది. అఖిల భారత సర్వీసులోని కొందరు సీనియర్ అధికారులు ఇప్పటికే స్టాలిన్ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.
మొత్తంమీద రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే ఆఫీసుల్లో సంబరాలు మొదలైపోయాయి. తమిళనాడులో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా రెండుపార్టీల మధ్య హోరా హోరీగా పోటీ ఉండేది. అలాంటిది మొదటిసారి ఎన్నికలు ఏకపక్షంగా జరిగినట్లు అర్ధమవుతోంది. ఇటు డీఎంకేలో కానీ అటు ఏఐఏడీఎంకేలో కానీ స్టాల్ వార్ట్స్ అని చెప్పుకునే పర్సనాలిటీలు లేరు. కరుణానిధి, జయలలిత ఇద్దరు లేకుండా జరిగిన మొదటి ఎన్నిక ఇదే.
పళనిస్వామి మీద జనాల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినా ప్రభుత్వాన్ని వెనకనుండి బీజేపీనే నడిపిస్తోందనే ప్రచారం రాష్ట్రంలో విపరీతంగా జరిగింది. ఈ విషయంలో బీజేపీ నేతలు కూడా దాపరికం లేకుండానే వ్యవహరించారట. దాంతో బీజేపీ మీదున్న వ్యతిరేకత ఏఐఏడీఎంకే మీద కూడా చూపించేశారు జనాలు. సరే మిగిలిన పార్టీల వ్యవహారం ఎలాగున్నా డీఎంకే నేతలు మాత్రం కౌంటింగ్ కు రెండు రోజుల ముందే హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోయింది మాత్రం వాస్తవం.
This post was last modified on May 2, 2021 9:39 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…