ఏపీ సీఎం జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తన తొలి కేబినెట్ను ఏర్పాటు చేసిన రోజు రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఏర్పాటు చేసిన కేబినెట్లో 90 శాతం మంత్రుల స్థానంలో కొత్తవారు వస్తారని… 10 శాతం మంత్రులు మాత్రమే కంటిన్యూ అవుతారని చెప్పారు. తొలి టర్మ్లో జగన్ చాలా మంది జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ క్రమంలోనే చాలా మంది సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వలేదు. జగన్ కేబినెట్లో చోటు కోసం ఐదారుసార్లు గెలిచిన వారు కూడా రేసులో ఉన్నారు.
మరో మూడు, నాలుగు నెలల్లో జరిగే మార్పులు, చేర్పుల్లో చాలా మంది సీనియర్లు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే వీరిలో అందరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న గ్యారెంటీ అయితే లేదు. తొలి టర్మ్లో ఎలా అయితే తొలిసారి గెలిచిన వారికి మంత్రి పదవులు వచ్చాయో ? ఇప్పుడు ప్రక్షాళనలో కూడా కొందరు జూనియర్లకు అలాగే మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం అయితే జరుగుతోంది. ఇందుకు సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు కూడా కలిసి రానున్నాయి. ఈ లిస్టులో చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వేంకటేగౌడ కూడా ఉన్నారు.
వేంకటేగౌడ తొలిసారే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన గెలపు ఓ సంచలనం. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని ఆయన భారీ మెజార్టీతో ఓడించారు. అయితే ఇప్పుడు ఆయన కేబినెట్ రేసులో పైన ఉండడానికి ప్రధాన కారణం.. ఆయన సామాజిక సమీకరణలే. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కులంతో పాటు సీమ ఈక్వేషన్ కూడా కలిసి రానుంది. ఇదే వర్గం నుంచి కృష్ణా జిల్లాలో జోగి రమేష్ సీనియర్ ఎమ్మెల్యే అయినా.. జిల్లా ఈక్వేషన్ రమేష్కు మైనస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో కమ్మ, కాపు ఈక్వేషన్లను మార్చే ఛాన్సులు లేవు. ఇక ఇవన్నీ కలిసి రావడంతో పాటు వేంకటేగౌడ బాస్ అయిన మంత్రి పెద్దిరెడ్డి అండదండలు కూడా పుష్కలంగా ఉండడంతో ఆయనకు మంత్రి పదవి సులువుగా వస్తుందన్న చర్చలే వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి వేంకటేగౌడకు మంత్రి పదవి లక్ ఎంత వరకు కలిసి వస్తుందో ? చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…