ఏపీ సీఎం జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తన తొలి కేబినెట్ను ఏర్పాటు చేసిన రోజు రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఏర్పాటు చేసిన కేబినెట్లో 90 శాతం మంత్రుల స్థానంలో కొత్తవారు వస్తారని… 10 శాతం మంత్రులు మాత్రమే కంటిన్యూ అవుతారని చెప్పారు. తొలి టర్మ్లో జగన్ చాలా మంది జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ క్రమంలోనే చాలా మంది సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వలేదు. జగన్ కేబినెట్లో చోటు కోసం ఐదారుసార్లు గెలిచిన వారు కూడా రేసులో ఉన్నారు.
మరో మూడు, నాలుగు నెలల్లో జరిగే మార్పులు, చేర్పుల్లో చాలా మంది సీనియర్లు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే వీరిలో అందరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న గ్యారెంటీ అయితే లేదు. తొలి టర్మ్లో ఎలా అయితే తొలిసారి గెలిచిన వారికి మంత్రి పదవులు వచ్చాయో ? ఇప్పుడు ప్రక్షాళనలో కూడా కొందరు జూనియర్లకు అలాగే మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం అయితే జరుగుతోంది. ఇందుకు సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు కూడా కలిసి రానున్నాయి. ఈ లిస్టులో చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వేంకటేగౌడ కూడా ఉన్నారు.
వేంకటేగౌడ తొలిసారే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన గెలపు ఓ సంచలనం. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని ఆయన భారీ మెజార్టీతో ఓడించారు. అయితే ఇప్పుడు ఆయన కేబినెట్ రేసులో పైన ఉండడానికి ప్రధాన కారణం.. ఆయన సామాజిక సమీకరణలే. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కులంతో పాటు సీమ ఈక్వేషన్ కూడా కలిసి రానుంది. ఇదే వర్గం నుంచి కృష్ణా జిల్లాలో జోగి రమేష్ సీనియర్ ఎమ్మెల్యే అయినా.. జిల్లా ఈక్వేషన్ రమేష్కు మైనస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో కమ్మ, కాపు ఈక్వేషన్లను మార్చే ఛాన్సులు లేవు. ఇక ఇవన్నీ కలిసి రావడంతో పాటు వేంకటేగౌడ బాస్ అయిన మంత్రి పెద్దిరెడ్డి అండదండలు కూడా పుష్కలంగా ఉండడంతో ఆయనకు మంత్రి పదవి సులువుగా వస్తుందన్న చర్చలే వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి వేంకటేగౌడకు మంత్రి పదవి లక్ ఎంత వరకు కలిసి వస్తుందో ? చూడాలి.
This post was last modified on May 1, 2021 9:42 am
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…