“దేశంలో కరోనా విశ్వరూపంపై కేంద్రం ఏం చేస్తోంది? టీకా విషయంలో ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి? ఎస్సీ , ఎస్టీ వర్గాలకు.. రిజర్వేషన్ ప్రాతిపదికన.. టీకా ఎందుకు ఇవ్వకూడదు?”.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నలతో ముంచెత్తింది. అదే సమయంలో పలు సూచనలు, సలహాలు చేసింది. ఇక, కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.
జాతీయ అత్యవసర పరిస్థితి!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడం, వ్యాక్సిన్ కొరత, వైద్యంలో లోపాలు.. మృతుల సంఖ్య పెరుగుతుండడం వంటి అనేక విషయాలపై సుప్రీం కోర్టు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే.. ఈ అఫిడవిట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. కేంద్ర-రాష్ట్రాల మధ్య కరోనాపై సరైన సమాచార మార్పిడి లేనట్టుగా ఉందని పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితిలో ఉన్నామని.. పేర్కొంది.
వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఇలాగేనా?
వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ విషయంలోని లోపాలను సైతం సుప్రీం కోర్టు తెరమీదికి తెచ్చింది. నిరక్షరాస్యులు, గ్రామీణులు.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని.. దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా? అని ప్రశ్నించింది. అమికస్ క్యూరీగా మీనాక్షి అరోరా వ్యవహరించిన ఈ కేసులో .. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
This post was last modified on April 30, 2021 3:17 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…