“దేశంలో కరోనా విశ్వరూపంపై కేంద్రం ఏం చేస్తోంది? టీకా విషయంలో ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి? ఎస్సీ , ఎస్టీ వర్గాలకు.. రిజర్వేషన్ ప్రాతిపదికన.. టీకా ఎందుకు ఇవ్వకూడదు?”.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నలతో ముంచెత్తింది. అదే సమయంలో పలు సూచనలు, సలహాలు చేసింది. ఇక, కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.
జాతీయ అత్యవసర పరిస్థితి!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడం, వ్యాక్సిన్ కొరత, వైద్యంలో లోపాలు.. మృతుల సంఖ్య పెరుగుతుండడం వంటి అనేక విషయాలపై సుప్రీం కోర్టు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే.. ఈ అఫిడవిట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. కేంద్ర-రాష్ట్రాల మధ్య కరోనాపై సరైన సమాచార మార్పిడి లేనట్టుగా ఉందని పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితిలో ఉన్నామని.. పేర్కొంది.
వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఇలాగేనా?
వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ విషయంలోని లోపాలను సైతం సుప్రీం కోర్టు తెరమీదికి తెచ్చింది. నిరక్షరాస్యులు, గ్రామీణులు.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని.. దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా? అని ప్రశ్నించింది. అమికస్ క్యూరీగా మీనాక్షి అరోరా వ్యవహరించిన ఈ కేసులో .. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
This post was last modified on April 30, 2021 3:17 pm
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…