“దేశంలో కరోనా విశ్వరూపంపై కేంద్రం ఏం చేస్తోంది? టీకా విషయంలో ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి? ఎస్సీ , ఎస్టీ వర్గాలకు.. రిజర్వేషన్ ప్రాతిపదికన.. టీకా ఎందుకు ఇవ్వకూడదు?”.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నలతో ముంచెత్తింది. అదే సమయంలో పలు సూచనలు, సలహాలు చేసింది. ఇక, కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.
జాతీయ అత్యవసర పరిస్థితి!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడం, వ్యాక్సిన్ కొరత, వైద్యంలో లోపాలు.. మృతుల సంఖ్య పెరుగుతుండడం వంటి అనేక విషయాలపై సుప్రీం కోర్టు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే.. ఈ అఫిడవిట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. కేంద్ర-రాష్ట్రాల మధ్య కరోనాపై సరైన సమాచార మార్పిడి లేనట్టుగా ఉందని పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితిలో ఉన్నామని.. పేర్కొంది.
వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఇలాగేనా?
వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ విషయంలోని లోపాలను సైతం సుప్రీం కోర్టు తెరమీదికి తెచ్చింది. నిరక్షరాస్యులు, గ్రామీణులు.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని.. దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా? అని ప్రశ్నించింది. అమికస్ క్యూరీగా మీనాక్షి అరోరా వ్యవహరించిన ఈ కేసులో .. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
This post was last modified on April 30, 2021 3:17 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…