“దేశంలో కరోనా విశ్వరూపంపై కేంద్రం ఏం చేస్తోంది? టీకా విషయంలో ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి? ఎస్సీ , ఎస్టీ వర్గాలకు.. రిజర్వేషన్ ప్రాతిపదికన.. టీకా ఎందుకు ఇవ్వకూడదు?”.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నలతో ముంచెత్తింది. అదే సమయంలో పలు సూచనలు, సలహాలు చేసింది. ఇక, కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.
జాతీయ అత్యవసర పరిస్థితి!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడం, వ్యాక్సిన్ కొరత, వైద్యంలో లోపాలు.. మృతుల సంఖ్య పెరుగుతుండడం వంటి అనేక విషయాలపై సుప్రీం కోర్టు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే.. ఈ అఫిడవిట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. కేంద్ర-రాష్ట్రాల మధ్య కరోనాపై సరైన సమాచార మార్పిడి లేనట్టుగా ఉందని పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితిలో ఉన్నామని.. పేర్కొంది.
వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఇలాగేనా?
వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ విషయంలోని లోపాలను సైతం సుప్రీం కోర్టు తెరమీదికి తెచ్చింది. నిరక్షరాస్యులు, గ్రామీణులు.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని.. దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా? అని ప్రశ్నించింది. అమికస్ క్యూరీగా మీనాక్షి అరోరా వ్యవహరించిన ఈ కేసులో .. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
This post was last modified on April 30, 2021 3:17 pm
వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అంటూ వివాదాలు, గొడవల్లో ఉంటున్న మంచు సోదరులు విష్ణు, మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా…
రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా…
మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్…
ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా…
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…