Political News

కడప ఆసుపత్రులే ప్రభుత్వాన్ని లెక్క చేయటంలేదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కడప పట్టణంలోని ఎనిమిది ఆసుపత్రుల యాజమాన్యాలు కోవిడ్ రోగులకు చికిత్సను అందించమంటు బయట పెద్ద బోర్టులు, బ్యానర్లు పెట్టేయటం కలకలం సృష్టిస్తోంది. దీనికి ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్న కారణాలు ఏమిటయ్యా అంటే కరోనా వైరస్ నేపధ్యంలో చికిత్స అందిస్తున్న తమ వైద్యులను ప్రభుత్వం వేధిస్తున్నదట. ఇందుకు నిరసనగా అసలు కోవిడ్ రోగులను చేర్చుకోవటమే మానేశారు.

అసలు విషయం ఏమిటంటే కోవిడ్ రోగులకు చికిత్సను అందించటంలో భాగంగా కొన్ని ఆసుపత్రులు నిర్దేశించిన ఫీజులకన్నా బాగా ఎక్కువగా వసూళ్ళు చేస్తున్నాయట. ఆరోపణలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టిపెట్టింది. అవసరమైన ఆధారాలను సేకరించిన తర్వాత రెండు ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు దాడులుచేశారు. అధిక ఫీజులను వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. దాంతో మిగిలిన ఆసుపత్రులకు కూడా బాగా మండింది.

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల స్ధానంలో తమిష్టం వచ్చినంత ఫీజులు వసూలు చేసుకుంటామన్న ధోరణిలో ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో ఎనిమిది ఆసుపత్రులు కోవిడ్ రోగలను చేర్చుకోవటం మనేశాయి. ఒక్కసారిగా ఎనిమిది ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులను చేర్చుకోవటం ఆపేయటంతో ఇబ్బందులు మొదలైపోయాయి.

ఇదే విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిది ఆసుపత్రుల నిర్ణయంతో తమకు సంబంధం లేదన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు శుక్రవారం కలెక్టర్ తో భేటీ అవుతున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారం అవుతుందనే అనుకుంటున్నట్లు రెడ్డి తెలిపారు. మరి కలెక్టర్- ఆసుపత్రుల యాజమాన్యం భేటిలో ఏమవుతుందో చూడాలి.

This post was last modified on April 30, 2021 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

10 minutes ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

2 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

2 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

3 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

6 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

7 hours ago