Political News

కడప ఆసుపత్రులే ప్రభుత్వాన్ని లెక్క చేయటంలేదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కడప పట్టణంలోని ఎనిమిది ఆసుపత్రుల యాజమాన్యాలు కోవిడ్ రోగులకు చికిత్సను అందించమంటు బయట పెద్ద బోర్టులు, బ్యానర్లు పెట్టేయటం కలకలం సృష్టిస్తోంది. దీనికి ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్న కారణాలు ఏమిటయ్యా అంటే కరోనా వైరస్ నేపధ్యంలో చికిత్స అందిస్తున్న తమ వైద్యులను ప్రభుత్వం వేధిస్తున్నదట. ఇందుకు నిరసనగా అసలు కోవిడ్ రోగులను చేర్చుకోవటమే మానేశారు.

అసలు విషయం ఏమిటంటే కోవిడ్ రోగులకు చికిత్సను అందించటంలో భాగంగా కొన్ని ఆసుపత్రులు నిర్దేశించిన ఫీజులకన్నా బాగా ఎక్కువగా వసూళ్ళు చేస్తున్నాయట. ఆరోపణలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టిపెట్టింది. అవసరమైన ఆధారాలను సేకరించిన తర్వాత రెండు ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు దాడులుచేశారు. అధిక ఫీజులను వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. దాంతో మిగిలిన ఆసుపత్రులకు కూడా బాగా మండింది.

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల స్ధానంలో తమిష్టం వచ్చినంత ఫీజులు వసూలు చేసుకుంటామన్న ధోరణిలో ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో ఎనిమిది ఆసుపత్రులు కోవిడ్ రోగలను చేర్చుకోవటం మనేశాయి. ఒక్కసారిగా ఎనిమిది ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులను చేర్చుకోవటం ఆపేయటంతో ఇబ్బందులు మొదలైపోయాయి.

ఇదే విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిది ఆసుపత్రుల నిర్ణయంతో తమకు సంబంధం లేదన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు శుక్రవారం కలెక్టర్ తో భేటీ అవుతున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారం అవుతుందనే అనుకుంటున్నట్లు రెడ్డి తెలిపారు. మరి కలెక్టర్- ఆసుపత్రుల యాజమాన్యం భేటిలో ఏమవుతుందో చూడాలి.

This post was last modified on April 30, 2021 11:11 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

11 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

12 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

15 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

15 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

16 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

16 hours ago