Political News

టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కాగిత మృతి

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క‌రోనా దెబ్బ‌తో.. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు నాయ‌కులు, పార్టీ శ్రేణులు.. ప్రాణాలు కోల్పోతున్న విష‌యం తెలిసిందే. విశాఖ‌, చిత్తూరు, అనంత‌పురం జిల్లాల్లో వ‌రుస‌గా జ‌రుగుతున్న ఈ ఘ‌ట‌న‌ల‌పై పార్టీలో తీవ్ర ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆయాన ఘ‌ట‌న‌ల‌పై పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు మ‌రో కీల‌క నేత‌, పార్టీలో చాలా సీనియ‌ర్‌, మాజీ ఎమ్మెల్యే కాగిత వెంక‌ట్రావు తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయ‌న.. కొద్దిసేప‌టి కింద‌ట మృతి చెందారు. ఈ విషాదంతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. కృష్నాజిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాగిత వెంక‌ట్రావు.. టీడీపీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కాగిత‌.. కేవ‌లం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్ప‌ట్లో త్రిముఖ పోరు నెల‌కొన్న‌ప్ప‌టికీ.. కాగిత గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఓట్లు సంపాయించుకున్నారు. అంతేకాదు.. పార్టీని కూడా బ‌లోపేతం చేసేందుకు కృషి చేశారు. ఈ క్ర‌మంలోనే 2014లో ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేసి.. విజ‌యం సాధించారు. ఏకంగా 13 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కించుకుని గెలుపు గుర్రం ఎక్కారు. జిల్లాలో మంచి పేరున్న కాగిత‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కుతుంద‌ని అప్ప‌ట్లో చ‌ర్చ సాగింది.

అయితే.. అనారోగ్యం కార‌ణంగా 2018 నుంచి ఆయ‌న పార్టీలో పెద్దగా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కుమారుడు కాగిత కృష్ణ‌ప్ర‌సాద్ తండ్రివార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై కృష్ణ‌ప్ర‌సాద్ పోటీ చేశారు. అయితే.. వైసీపీ సునామీ కార‌ణంగా ఓడిపోయారు. అప్ప‌టి నుంచి పార్టీకోసం కృషి చేస్తున్నారు. కాగా, కాగిత వెంక‌ట్రావు మృతితో కృష్ణాజిల్లాలో టీడీపీ కీల‌క‌మైన నాయ‌కుడిని కోల్పోయింద‌ని.. సీనియ‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on April 29, 2021 4:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

1 hour ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

3 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

3 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

4 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

5 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

6 hours ago