Political News

టీడీపీ నేత‌ల‌పై కేసులు.. జ‌గ‌న్ ల‌క్ష్యాలు ఆ రెండేనా?

రాష్ట్రంలో ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా టీడీపీ నేత‌ల‌పై వైసీపీ ప్ర‌భుత్వం కేసులు పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ రెండేళ్ల జగ‌న్ పాల‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది సీనియ‌ర్లు అరెస్ట‌య్యారు. బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం రాష్ట్ర టీడీపీ చీఫ్‌గా ఉన్న అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ వంటివారిని అరెస్టు చేసి, రాజ‌కీయంగా వారిపై కేసులు న‌మోదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే.. కేవ‌లం వీరిని అరెస్టు చేయ‌డ‌మేనా?.. జ‌గ‌న్ ఉద్దేశం.

అయితే.. కేవ‌లం అరెస్టు చేయ‌డ‌మే అయితే.. జ‌గ‌న్‌కు కానీ, వైసీపీకి కానీ.. వ‌చ్చే లాభం ఏంటి? టీడీపీకి వ‌చ్చే న‌ష్టం ఏంటి? అనే విష‌యాల‌పైఇప్ప‌టి వ‌ర‌కు పెద్దగా చ‌ర్చ‌కు రాలేదు. కానీ, ఇప్పుడు వ్యూహాలు మారాయి. జ‌గ‌న్ రెండు ప్ర‌యోజనాల‌ను ఆశించి.. టీడీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేస్తున్నారు. వీటిలో ఒక‌టి.. నేత‌ల ఇమేజ్ ఫుల్లుగా డ్యామేజీ చేసి.. వారిని అవినీతి నాయ‌కులుగా.. ప్ర‌జ‌ల సొమ్ము తినేవారుగా చిత్రీక‌రించ‌డం. రెండు.. ఆర్థికంగా వారిని దెబ్బ‌తీయడం. ఈ రెండు విష‌యాలే కాకుండా మ‌రిన్ని రీజ‌న్లు కూడా ఉన్నాయ‌ని అంటున్నా.. ప్ర‌ధానంగా ఈ రెండు రీజ‌న్ల‌ను కీల‌కంగా చేసుకుని.. కేసులు ముమ్మ‌రం చేస్తున్నారు.

టీడీపీ నేత‌ల‌ను ప‌రిశీలిస్తే.. సంస్థాగ‌తంగా వారికి వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లుకుబ‌డి.. ప్ర‌జాబ‌లం మెండుగా ఉంది. అచ్చెన్న అయినా.. దేవినేని అయినా.. జేసీ అయినా.. ధూళిపాళ్ల అయినా.. ఎవ‌రికి వారు వారివారి నియోజ‌క‌వ‌ర్గాల్లో పేరు తెచ్చుకున్నారు. వీరిలో అచ్చెన్న మిన‌హా… గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ కావొచ్చు.. లేదా మ‌రో రీజ‌న్ కావొచ్చు ఓడిపోయారే త‌ప్ప‌.. ప్ర‌జాబ‌లం లేని నాయ‌కులు కాదు. సో.. వీరిని దెబ్బ‌తీయడం ద్వారా టీడీపీని దెబ్బ‌తీయాల‌నేది ప్ర‌ధాన ల‌క్ష్యంగా జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

అదేస‌మ‌యంలో ఆర్ధికంగా వారి మూలాల‌ను ఏరివేయ‌డంద్వారా.. త‌న స్థానాల‌ను మెరుగు ప‌రుచుకోవ‌డం అనేది దాగి ఉంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇది సాధ్య‌మా? అసాధ్య‌మా? అనేది ఇప్ప‌టికిప్పుడు ఎవ‌రూ ప్రెడిక్ట్ చేయ‌లేక‌పోయినా.. జ‌రుగుతున్న త‌తంగంలో జ‌గ‌న్ వ్యూహాల‌ను మాత్రం అర్ధం చేసుకుంటున్నారు. తాను గెల‌వ‌లేన‌ప్పుడు ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌హీన‌త‌ల‌పైనా.. బ‌లాల‌పైనా దెబ్బ‌కొట్ట‌డం అనే రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 29, 2021 11:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు వారు అలా అన్నారో లేదో…

టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్.. డెకాయిట్ సినిమా స‌క్సెస్ మీట్లో ఈ చిత్ర క‌థానాయిక మృణాల్ ఠాకూర్‌ను ఉద్దేశించిన…

60 minutes ago

ప్యారడైజ్ గుమ్మడికాయ… రోమియో కొబ్బరికాయ

మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…

5 hours ago

లీకులు సరే… నెక్స్ట్ ఏంటి నాయకా

జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…

8 hours ago

అదేంటో… మోడీ స‌ర్‌కి ఎన్నిక‌ల‌ప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి!

అదేంటో కానీ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీకి ప‌లు కీల‌క విష‌యాలు సాధార‌ణ రోజుల్లో ఎక్క‌డా గుర్తుకు ఉండ‌వు... రావు. ఎన్నిక‌ల…

9 hours ago

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

11 hours ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

12 hours ago