Political News

కేజ్రీవాల్ కి చావు దెబ్బ

గడచిన పదేళ్ళకు పైగా కంట్లో నలుసులాగ తయారైన అరవింద్ కేజ్రీవాల్ అధికారాలకు నరేంద్రమోడి కత్తెర వేసేశారు. అంటే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ప్రధానమంత్రి మోడి కేవలం ఉత్సవ విగ్రహంలాగ తయారు చేశారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీ ప్రభుత్వం సవరణ చట్టం-2021 ప్రకారం సీఎంగా కేజ్రీవాల్ కున్న అన్నీ అధికారాలను కేంద్రప్రభుత్వం తన చేతిలోకి తీసేసుకున్నది. తీసుకున్నది అనేకన్నా లాగేసుకున్నారని అనటమే కరెక్టు.

నిజానికి ఢిల్లీకి రాష్ట్రహోదా ఉన్నా ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంది. కీలకమైన శాంతి భద్రతలు, పోలీసులు, భూమి సంబంధిత అధికారాలన్నీ కేంద్రప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. ఇపుడు తాజాగా అమల్లోకి వచ్చిన సవరణ చట్టం ప్రకారం విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, అటవీ, రవాణా లాంటి అంశాల్లో కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) అనుమతి తప్పనిసరి.

ఒకవేళ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న ఎల్జీ గనుక ఆమోదించకపోతే చేసేదేమీలేదు. అంటే ఇప్పటినుండి ఎల్జీని ముందుపెట్టి నరేంద్రమోడి ప్రభుత్వం కేజ్రీవాల్ ను సతాయించటం మొదలవ్వటం ఖాయమని అర్ధమైపోతోంది. గతంలో కూడా మోడి ఒకసారి ఎల్జీకే అధికారాలను కట్టబెట్టాలని ప్రయత్నిస్తే ఢిల్లీ హైకోర్టు అడ్డుకుంది. కొంతకాలం కామ్ గా ఉన్న మోడి ఇపుడు ఏకంగా చట్టాన్నే సవరించేశారు. దీనిప్రకారం ఇపుడు కేజ్రీవాల్ ప్రోటోకాల్ కు మాత్రమే పరిమితమవుతారంతే.

మోడి ప్రభుత్వం తాజాగా చేసిన చట్ట సవరణపై కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్ట్ నెంట్ గవర్నరే అని అనుకోవాలి. నిజానికి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఏదో విధంగా అధికారాలను చెలాయించ గలుగుతున్నది బీజేపీ. అయితే గడచిన పదేళ్ళుగా ఢిల్లీలో మాత్రం మోడి, బీజేపీ ఆటలు సాగటంలేదు. అందుకనే ప్రజలెన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని కాదని ఓ తోలుబొమ్మ చేతికి అధికారాలను కట్టబెట్టేశారు మోడి.

దీంతో ఎలాగైనా కేజ్రీవాల్ ను దెబ్బకొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా కేజ్రీవాల్ ను దెబ్బకొట్టడం సాధ్యం కాదని అర్ధమైపోయింది. అందుకనే పరిమితమైన అధికారాలతోనే అయినా పూర్తిస్ధాయి స్వయం ప్రతిపత్తి గలిగిన యూనియన్ టెరిటరీ ఢిల్లీ చట్టాన్నే సవరించేశారు. మరి తాజాగా కేంద్రం చేసిన చట్ట సవరణ న్యాయసమీక్ష ముందు నిలబడుతుందా ?

This post was last modified on April 29, 2021 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

34 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago