Political News

కరోనా బారిన పడి జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు?

విపత్తు వచ్చినప్పుడు అత్యవసర శాఖకు చెందిన అధికారులకు రెట్టింపు పని ఉంటుంది. వారికి ప్రభుత్వ రక్షణ ఉంటుంది. కానీ.. జర్నలిస్టులకు అలాంటి పరిస్థితి ఉండదు. పనికి పని.. ఒత్తిడికి ఒత్తిడి ఉంటుంది కానీ.. జరగరానికి ఏదైనా జరిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటివరకు ఎన్నో విపత్తులకు ఎదురొడ్డి పని చేసిన జర్నలిస్టులకు తొలిసారి కరోనా రూపంలో పెను ముప్పు పొంచి ఉంది.

గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. కరోనా సెకండ్ వేవ్ లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున చనిపోతున్నారు. సాధారణంగా పాత్రికేయ రంగంలో మరణాలు తక్కువగానే ఉంటాయి. దీనికి కారణం.. జర్నలిస్టుల సగటు వయసు తక్కువగానే ఉంటుంది. ఈ ప్రొఫెషన్ లోకి వచ్చిన వారు చాలామంది పది.. పదిహేనేళ్లు చేసినంతనే వేరే రంగంలోకి వెళ్లిపోతారు. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే ఈ రంగంలో ఎక్కువ కాలం నిలదొక్కుకోకపోవటమే ఇందుకు కారణం.

అలా అని అందరూ ఉంటారని కాదు కానీ.. ఎక్కువమంది ఇదే ధోరణిలో ఉంటారు. ఈ కారణంగా పెద్ద వయస్కులు తక్కువగానే ఉంటారు. చాలావరకు యువకులు.. మధ్యవయస్కులే ఎక్కువ. సెకండ్ వేవ్ కవరేజ్ విషయమై యాజమన్యాలు కఠినంగా ఉండటం.. వారు పెట్టిన టార్గెట్లను అచీవ్ కావాలన్న మొండితనంతో వెనుకా ముందు చూసుకోకుండా పని చేస్తూ కరనా బారిన పడుతున్నారు.

ప్రింట్ మీడియా కొంతవరకు ఫర్లేదుకానీ.. ఎలక్ట్రానిక్ మీడియాలో విజువల్స్ కోసం.. బైట్ల కోసం కరోనా రోగులకు దగ్గరగా.. కరోనాకు మరింత దగ్గరగా వెళుతున్న వారు దాని బారిన పడుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం.. తమకేం కాదన్న భరోసాతో కూడిన నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. ఈ కారణంతోనే రోజుకు కనీసం ఒకరు.. గరిష్ఠంగా ఇద్దరు ముగ్గురు చొప్పున ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండటంతో ఇప్పుడు జర్నలిస్టు వర్గాల్లో కొత్త కలకలం రేగుతోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యాజమాన్యాల తీరు మారకపోతే.. వారి వద్ద పని చేసే జర్నలిస్టులు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పని దుస్థితి.

This post was last modified on April 27, 2021 6:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

7 minutes ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

29 minutes ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

37 minutes ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

3 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

8 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

9 hours ago