టీడీపీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రజాబలం ఉన్న నాయకులు పనిచేయడం లేదు. ప్రజల బలం లేనివారు… ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని వారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. పోనీ.. వీరిని నమ్ముకుని చంద్రబాబు ముందుకు నడిచే పరిస్థితి ఉందా? అంటే.. అది కూడా లేదు. దీంతో పార్టీ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. నిత్యం మీడియాలో కనిపిస్తున్న మొహాలను చూస్తే.. టీడీపీ తరఫున బాగా మాట్లాడుతున్నారు. మంచి మంచి కౌంటర్లు ఇస్తున్నారు.. ప్రభుత్వానికి దడ పుట్టిస్తున్నారు.. అని అనిపిస్తుంది. నిజమే వారు చేసే కామెంట్లు కూడా అలానే ఉంటున్నాయి.
ఇలాంటి వారిలో బుచ్చి రాంప్రసాద్, వర్ల రామయ్య, కొమ్మారెడ్డి పట్టాభి రాం, పంచుమర్తి అనురాధ, అయ్యన్న పాత్రుడు (గత ఎన్నికల్లో ఓడిపోయారు), సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (ఐదుసార్లు ఓటమి), పిల్లి మాణిక్యాలరావు.. ఇలా అనేక మంది కనిపిస్తారు. వీరికి మైక్ కనిపిస్తే.. చాలు.. ఛానెల్ ఏదైనా ఓకే.. అది రాష్ట్ర ఛానెలే అయి ఉండాల్సిన అవసరం లేదు.. లోకల్ మౌత్ అయినా సరే.. వీరి వాగ్ధాటిని ఆపడం ఎవరితరమూ కాదు.. ఇక, మరికొందరు ఉన్నారు. వీరు మీడియా ముందుకు రాకపోయినా.. ఫేస్ బుక్ లైవులు, వాట్సాప్ లైవులు.. అంటూ.. సర్కారుపై నిప్పులు చెరిగేస్తారు.
సర్కారు తప్పులు చేస్తోందంటూ.. చెరిగేస్తారు. ఇక, అనుకూల మీడియాలో వీరి గురించి పెద్ద ఎత్తున కవరేజీ వస్తుంది. బ్యానర్ హెడ్డింగులు.. పెద్ద పెద్ద ఫొటోలు వస్తాయి. దీంతో టీడీపీ వెలిగిపోతోందని .. చంద్రబాబు సహా లోకేష్లు ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు కూడా భావిస్తున్నారు. కానీ.. వాస్తవానికి వీరికి ప్రజా బలం లేదు. వీరి మాటలను ప్రజలు ఎంత వరకు నమ్ముతారో తెలియదు. పైగా ఇలా .. మైకులు చించుకుంటున్న వారిలో చాలా మందికి క్షేత్రస్థాయిలో పట్టులేదు.
వీరు ఒకరిద్దరు మినహా మిగిలిన నేతలు అంతా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రజల మధ్య నిలిచింది లేదు.. నిలిచినా.. గెలిచింది కూడా లేదు. పోనీ పార్టీలో ప్రజాబలం ఉన్నవాళ్లు లేరా? అంటే.. ఉన్నారు. కానీ, వారికి మీడియా అంటే భయం.. మైకు కనిపిస్తే.. తప్పించేసుకుంటున్నారు. మరి ఇలాంటి భిన్నమైన వ్యక్తులు, నేతలను కలుపుకొని పోవడం చంద్రబాబుకు మరింత కష్టంగా మారింది. ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.
This post was last modified on April 25, 2021 10:02 am
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…