Political News

ఎల్జీ పాలిమర్స్ ఎదుట ధర్నా- 50 మందిపై కేసు

తీవ్ర విషాదకరమైన వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన అనంతరం స్థానికులు అయిన బాధితులు కొందరు కంపెనీ మూసేయాలంటే దాని ఎటు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మూడు రోజులు పలుమార్లు ఈ ధర్నాలు జరిగాయి. అయితే, ఈ ధర్నాలో పాల్గొన్న 50 మందిపై పోలీసు కేసులు నమోదవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

ఎల్జీ పాలిమర్స్ ప్యాక్టరీ ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో ఉంది. ఈ ఏరియా మొత్తం గోపాలపట్నం పోలీస్ స్టేషను పరిధిలోకి వస్తుంది. ఆందోళనకారులకు పలుమార్లు సర్ది చెప్పినా, ప్రభుత్వం అన్ని చర్యలకు హామీ ఇచ్చినా ధర్నా విరమించలేదు. అందుకే వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పైగా అక్కడ లాక్ డౌన్ నిబంధనలతో పాటు, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేవరకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ ఉల్లంఘించారన్నది పోలీసుల వాదన.

అయితే… మృతుల్లోని ఒక చిన్నారి తల్లి లత ధర్నా సందర్భంగా పోలీసు భద్రతను దాటుకుని కంపెనీ గేటుదాటుకుని లోపలకు వెళ్లింది. అనంతరం ఆమెను పోలీసులు బలవంతంగా బయటకు తరలించారు. సోషల్ మీడియాలో ఈమెపై కేసు నమోదైనట్లు, ఆమెను జైలుకు పంపినట్లు వదంతులు ప్రచారమవగా విశాఖపట్నం డీసీపీ-2 ఉదయ్ భాస్కర్ దీనిని కొట్టిపారేశారు. చనిపోయిన చిన్నారి తల్లి లతపై ఏ కేసు నమోదు చేయలేదని ఆయన స్పష్టంచేశారు. ఫేక్ వార్తలు ప్రచారం చేయడం నేరం అని హెచ్చరించారు.

This post was last modified on May 14, 2020 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago