Political News

ఎల్జీ పాలిమర్స్ ఎదుట ధర్నా- 50 మందిపై కేసు

తీవ్ర విషాదకరమైన వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన అనంతరం స్థానికులు అయిన బాధితులు కొందరు కంపెనీ మూసేయాలంటే దాని ఎటు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మూడు రోజులు పలుమార్లు ఈ ధర్నాలు జరిగాయి. అయితే, ఈ ధర్నాలో పాల్గొన్న 50 మందిపై పోలీసు కేసులు నమోదవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

ఎల్జీ పాలిమర్స్ ప్యాక్టరీ ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో ఉంది. ఈ ఏరియా మొత్తం గోపాలపట్నం పోలీస్ స్టేషను పరిధిలోకి వస్తుంది. ఆందోళనకారులకు పలుమార్లు సర్ది చెప్పినా, ప్రభుత్వం అన్ని చర్యలకు హామీ ఇచ్చినా ధర్నా విరమించలేదు. అందుకే వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పైగా అక్కడ లాక్ డౌన్ నిబంధనలతో పాటు, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేవరకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ ఉల్లంఘించారన్నది పోలీసుల వాదన.

అయితే… మృతుల్లోని ఒక చిన్నారి తల్లి లత ధర్నా సందర్భంగా పోలీసు భద్రతను దాటుకుని కంపెనీ గేటుదాటుకుని లోపలకు వెళ్లింది. అనంతరం ఆమెను పోలీసులు బలవంతంగా బయటకు తరలించారు. సోషల్ మీడియాలో ఈమెపై కేసు నమోదైనట్లు, ఆమెను జైలుకు పంపినట్లు వదంతులు ప్రచారమవగా విశాఖపట్నం డీసీపీ-2 ఉదయ్ భాస్కర్ దీనిని కొట్టిపారేశారు. చనిపోయిన చిన్నారి తల్లి లతపై ఏ కేసు నమోదు చేయలేదని ఆయన స్పష్టంచేశారు. ఫేక్ వార్తలు ప్రచారం చేయడం నేరం అని హెచ్చరించారు.

This post was last modified on May 14, 2020 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

1 hour ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago