బెజవాడ రాజకీయాల్లో తనకంటూ.. ఒక గుర్తింపు పొందారు.. కమ్యూనిస్టు నాయకుడు.. మాజీ కార్పొరేటర్.. చిగురుపాటి బాబూరావు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో ఒకప్పటి తరం కామ్రేడ్లతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలోనే కార్పొరేటర్గా కూడా నాలుగు సార్లు.. గెలుపొందారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, సీపీఐ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు. విజయవాడ పై పట్టుతోపాటు.. కార్పొరేషన్ వ్యవహారాలపై మంచి అనుభవం ఉన్న నాయకుడిగా బాబూరావుకు పేరుంది.
ప్రస్తుతం కామ్రెడ్ ఉద్యమాలకు కేంద్రమైన విజయవాడలో కమ్యూనిస్టుల పరిస్ధితి దాదాపు కొడిగట్టింది. గత రెండు ఎన్నికల్లోనూ సీపీఎం తరఫున బాబూ రావు.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే.. ఈ రెండు సార్లు కూడా ఆయన ఘోరపరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో ఆయనకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. నిజానికి 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగారు. ఈ క్రమంలోనే జనసేన కూడా బాబూరావుకు మద్దతిచ్చింది. అయినప్పటికీ.. డిపాజిట్ దక్కించుకోలేక పోయారు.
వ్యక్తిగతంగా ఆయనకు మంచి పేరే ఉన్నా కమ్యూనిస్టుల కాలం చెల్లిన విధానాలకు తోడు.. బెజవాడలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పూర్తిగా కనుమరుగు అయిపోతుండడం ఆయనకు మైనస్ అయ్యింది. ఇక వచ్చే ఎన్నికల నాటికి కామ్రెడ్ల పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో చట్ట సభల్లో తన వాణి వినిపించాలన్న బాబూరావు ఆశలు నెరవేరే పరిస్థితి లేదు.
మూడున్నర దశాబ్దాలుగా బెజవాడ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన పోరాటాలతో తనదైన ముద్రవేసిన చిగురుపాటి బాబూరావు పరిస్థితి ఇక పేరుకే అన్న విధంగా మారిపోయింది. కానీ, ఆయన గడిచిన 15 సంవత్సరాలుగా.. తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని.. అధ్యక్షా అంటూ.. గళం విప్పాలని కలలు కంటున్నారు. కానీ, ఆ ఆశలు ఎప్పటకీ తీరేలా లేవని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 29, 2021 10:37 am
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…