టీడీపీలో సరికొత్త విషయం చర్చకు వస్తోంది. తమ్ముళ్లు ఈ విషయాన్ని తలుచుకుని కలవరపడుతున్నారు కూడా..! ఆ విషయం ఏంటి అంటారా ? అదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. అయితే.. ఓడిపోయినప్పటికీ.. ఒక విషయం మాత్రం తమ్ముళ్లకు పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా స్పష్టంగా తెలిసింది. అదేంటంటే.. పార్టీ ఓడిపోయింది.. కానీ.. ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ బూత్లకు వచ్చారు. దీని వెనుక వారు పంచిన డబ్బులు పనిచేశాయి. వైసీపీ నేతలు ఓటుకు ఇంతని పంచితే.. టీడీపీ నేతలు సైతం.. అంతో ఇంతో పంచారు. అందుకే.. కనీసం గౌరవ ప్రదమైన ఓట్లయినా.. వారికి లభించాయి.
ఇక, ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలను తీసుకుంటే.. మాత్రం సీన్ రివర్స్అయిపోయింది. టీడీపీ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది. చంద్రబాబు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే.. స్థానికంగా నేతలు మాత్రం పట్టు సడలకుండా.. పోటీకి సై అన్నారు. పోటీకి రంగంంలోకి దిగారు.. అయితే.. అధ్యక్షుడు చంద్రబాబే ఎన్నికలను బహిష్కరించిన తర్వాత.. స్థానికంగా నేతలకు ఆర్థిక సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రజలకు డబ్బు పంపకాలు జరగలేదు. ఫలితంగా ఓట్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మొత్తంగా స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకుకు, పరిషత్లో వచ్చిన ఓటు బ్యాంకుకు చాలా తేడా కనిపించింది.
ఈ విషయంపై టీడీపీలో పెద్ద ఎత్తున సమాలోచనలు జరిగాయి. మొత్తంగా తేల్చింది ఏంటంటే.. ఓటర్లకు డబ్బు పంచక తప్పదని…! ఇదే ఇప్పుడు టీడీపీని కలవర పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో డబ్బులు పంచకపోతే.. ఎవరూ ఓటు వేసేందుకు వచ్చే పరిస్థితి లేదని.. దీనికి సంబంధించి నాయకులు రెడీ అవ్వాల్సిందేనని పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీలో అందరి నేతల మధ్య ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.
అయితే.. ఇప్పుడు అధికార పార్టీ ఆర్థికంగా బలంగా ఉంది. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. మరోవైపు.. ప్రజలకు డబ్బులు పంచేందుకు కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని బలంగా డీ కొట్టాలంటే.. అంతకు మించి ప్రజలను ఆకర్షించాల్సిన అవసరం టీడీపీకి ఉంది. మరి ఇంత మొత్తం నిధులు ఎవరు ఇస్తారు? ఎలా వస్తాయి? చంద్రబాబు సర్దుబాటు చేయకపోతే.. ఎలా ..? మళ్లీ ఓటమేనా? అని నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. చంద్రబాబు గతంలోలా డబ్బు సర్దుబాటు చేయట్లేదన్న విమర్శలు కూడా పార్టీ నేతల్లో ఎక్కువుగా వినిపిస్తున్నాయి.
This post was last modified on April 23, 2021 7:16 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…