కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు దీనిని అమలు చేయనున్నారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఈ నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు మంత్రి ఆళ్ల నాని.. ప్రకటించారు. దీనిపై విస్తృతంగా చర్చించినట్టు ఆయన తెలిపారు. మంత్రి వర్గంలో అన్ని కోణాల్లోనూ చర్చించామన్నారు.
రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసిన దరిమిలా.. కరోనా నియంత్రణలో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నాని తెలిపారు. అయితే.. అత్యవసర సేవలకు.. మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇక, కరోనా వ్యాక్సిన్ను ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా ఇస్తున్న విషయాన్ని చెప్పిన మంత్రి నాని.. ఇప్పుడు 18 ఏళ్ల వయసు పైబడిన వారికి కూడా ఉచితంగా ఇస్తామని చెప్పారు.
18-45 ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా ఉచిత వ్యాక్సిన్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నాని తెలిపారు. దీనికి గాను ప్రభుత్వంపై రూ.1600 కోట్ల మేరకు భారం పడుతుందని తెలిపారు. మరో వైపు.. కరోనా పరీక్షలను కూడా విస్తృతంగా చేయనున్నట్టు తెలిపారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని మంత్రి నాని సూచించారు. మొత్తానికి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించగా.. ఇప్పుడు ఏపీలోనూ అమలులోకి రావడం గమనార్హం.
This post was last modified on April 23, 2021 7:03 pm
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…