కొవిడ్ సెకండ్ వేవ్ ఎంతగా కల్లోలం రేపుతోందో తెలిసిందే. గత ఏడాది ఇదే సమయానికి ఉన్న తీవ్రతతో పోలిస్తే ఇప్పుడు రెండు మూడు రెట్లు తీవ్రంగా ఉంది వైరస్. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. బెడ్లు ఖాళీ లేవు. ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో చేరిన రోగులకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయడం కూడా కష్టమవుతోంది. దేశవ్యాప్తంగా వివిధ స్టీల్ ప్లాంట్ల నుంచి వందల టన్నుల్లో ఆక్సిజన్ను వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.
విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంటు నుంచి కూడా రోజూ వందల టన్నుల ఆక్సిజన్ వివిధ ప్రాంతాలకు తరలుతోంది. ఐతే ఒక చోటి నుంచి ఆక్సిజన్ ట్యాంకులను ప్లాంట్లకు పంపి, అక్కడి నుంచి గమ్య స్థానానికి ఆక్సిజన్ తెప్పించుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఈ స్థితిలో ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ అద్భుత ప్రయత్నం చేసింది.
తెలంగాణకు ఒడిషాలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ వస్తుండగా.. ఇక్కడి నుంచి ట్యాంకులను పంపి, తిరిగి తెప్పించుకోవడానికి మూడు రోజుల సమయం పడుతుండటంతో ప్రభుత్వం అత్యవసర మార్గాన్ని ఎంచుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయంతో ఫైటర్ ప్లేన్స్ తెప్పించి.. వాటిలో ట్యాంకులను పంపి.. ఆక్సిజన్ నింపి.. తిరిగి హైదరాబాద్కు తీసుకొస్తోంది. ఒకేసారి తొమ్మిది ట్యాంకులను పంపి.. 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తెప్పిస్తుండటం విశేషం. ఈ ప్రక్రియ అంతే కొన్ని గంటల్లో ముగిసిపోతోంది.
ఇందుకోసం భారీగా ఖర్చవుతున్నప్పటికీ.. అత్యవసర పరిస్థితుల్లో దాని గురించి ఆలోచించకుండా ఈ మార్గాన్ని ఎంచుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడి ఇంటిక ిపరిమితం కాగా.. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. దీని పట్ల సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
This post was last modified on April 23, 2021 7:12 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…