తెలుగు దేశం పార్టీలో నేతల వరుస అరెస్టులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. తాజాగా పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేయడం రాజకీయాల్లో కలకలం రేపింది. గుంటూరు జిల్లాలోని చింతలపూడిలో ఆయన నివాసం వద్ద తెల్లవారు జామున పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఉదయం ఆయన ఇంటి వద్ద మోహరించారు. అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు ఆయనను తమ వాహనంలో తీసుకొని వెళ్ళారు. ఇకపోతే ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంఘం డైరీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సంగం డైరీ లో అక్రమాలు జరిగాయి అంటూ నరేంద్రపై 408, 409, 418, 420, 465 సెకన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ను ఖండించిన సీపీఐ రామకృష్ణ
మాజీ ఎమ్మెల్యే, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ఒక తీవ్రవాదినో, ఉగ్రవాదినో అరెస్టు చేసినట్లుగా 100 మంది పోలీసులను మోహరింపచేసి నరేంద్రను అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయగా.. ఇటీవల మాజీ మంత్రి దేవినేని ఉమాకు సిఐడి నోటీసులంటూ హడావుడి చేశారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇదంతా టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్చలో భాగమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
This post was last modified on April 23, 2021 1:16 pm
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…