Political News

బాబు విన్న‌పాలు బుట్ట‌దాఖ‌లు.. మే 2 కోసం వెయిటింగ్‌

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర ఆలోచ‌న చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప‌ట్టు సాధించాల‌ని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. దీంతో చిత్తూరు జిల్లాపై కాన్‌స‌న్ ‌ట్రేట్ చేశారు. ఈ క్ర‌మంలోనే తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో చిత్తూరు జిల్లా ప‌రిధిలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో లోకేష్‌ను బ‌లంగా ప్ర‌చారానికి దింపారు. ఇంతా చేస్తే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి దొంగ వోట్ల క‌ల‌క‌లం రేగింది. అధికార పార్టీ నేత‌లే దొంగో ఓట్లు వేయించారంటూ.. బ‌స్సుల్లో జ‌నాల‌ను త‌ర‌లించారంటూ.. చంద్ర‌బాబు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. వీడియోలు సేక‌రించారు. ఫోన్ సంభాష‌ణ‌ల ఆడియోల‌ను సాక్ష్యాలుగా చూపిస్తూ..తిరుప‌తిలో జ‌రిగిన ఎన్నిక‌ను ర‌ద్దు చేసి రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. ఆయా సాక్ష్యాల వీడియోలు, ఆడియోల‌ను కూడా పంపించారు. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌ధానాధికారి విజ‌యానంద్ కూడా నివేదిక‌లు ఇచ్చారు. అయితే.. వీరు ఇచ్చిన నివేదిక‌ల్లో మాత్రం అంతా స‌వ్యంగానే సాగింద‌ని.. ఇక్క‌డ ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. దొంగ వోట్లు వేసే అవ‌కాశం కూడా లేద‌ని వారు స్ప‌ష్టం చేస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మాచారం చేర‌వేశారు. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం తిరుప‌తి ఉప ఎన్నిక అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టింది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు రాసిన లేఖ‌లు, సాక్ష్యాల‌ను కూడా బుట్ట‌దాఖ‌లు చేసిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల నుంచి టీడీపీ నేత‌ల‌కు స‌మాచారం వ‌చ్చింది.

దీంతో ఇప్పుడు టీడీపీ నేత‌ల మ‌ధ్య మే-2 ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. ఆ రోజు.. తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం రానుంది. ఆ రోజు ఎన్నిక‌ల్లో క‌నుక టీడీపీకి ఘోర‌మైన ప‌రాజ‌యం వ‌స్తే.. ఏం చేయాలి? ఏవిధంగా ఎదురు దాడికి సిద్ధ‌మవ్వాలి? అనే విష‌యంపై స‌మాలోచ‌న చేస్తున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల నుంచి స‌మాచారం. అయితే.. ఇప్ప‌టికిప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోయినా.. ప్ర‌స్తుతం బీజేపీ అభ్య‌ర్థి ర‌త్న ప్ర‌భ ఎలాగూ హైకోర్టులో పిటిష‌న్ వేసిన నేప‌థ్యంలో తాము కూడా ఇంప్లీడ్ అయి.. స‌ద‌రు సాక్ష్యాధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పిస్తే.. జ‌గ‌న్ స‌ర్కారును ఇరుకున పెట్టిన‌ట్టు అవుతుంద‌ని ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. దీనిపై ఒక‌టి రెండు రోజుల్లోనే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు విన‌తిని కోర్టు ఏమేర‌కు ప‌రిష్క‌రిస్తుందో చూడాలి.

This post was last modified on April 23, 2021 12:25 pm

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

13 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

21 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

34 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

37 minutes ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

2 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago