Political News

బాబు విన్న‌పాలు బుట్ట‌దాఖ‌లు.. మే 2 కోసం వెయిటింగ్‌

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర ఆలోచ‌న చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప‌ట్టు సాధించాల‌ని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. దీంతో చిత్తూరు జిల్లాపై కాన్‌స‌న్ ‌ట్రేట్ చేశారు. ఈ క్ర‌మంలోనే తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో చిత్తూరు జిల్లా ప‌రిధిలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో లోకేష్‌ను బ‌లంగా ప్ర‌చారానికి దింపారు. ఇంతా చేస్తే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి దొంగ వోట్ల క‌ల‌క‌లం రేగింది. అధికార పార్టీ నేత‌లే దొంగో ఓట్లు వేయించారంటూ.. బ‌స్సుల్లో జ‌నాల‌ను త‌ర‌లించారంటూ.. చంద్ర‌బాబు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. వీడియోలు సేక‌రించారు. ఫోన్ సంభాష‌ణ‌ల ఆడియోల‌ను సాక్ష్యాలుగా చూపిస్తూ..తిరుప‌తిలో జ‌రిగిన ఎన్నిక‌ను ర‌ద్దు చేసి రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. ఆయా సాక్ష్యాల వీడియోలు, ఆడియోల‌ను కూడా పంపించారు. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌ధానాధికారి విజ‌యానంద్ కూడా నివేదిక‌లు ఇచ్చారు. అయితే.. వీరు ఇచ్చిన నివేదిక‌ల్లో మాత్రం అంతా స‌వ్యంగానే సాగింద‌ని.. ఇక్క‌డ ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. దొంగ వోట్లు వేసే అవ‌కాశం కూడా లేద‌ని వారు స్ప‌ష్టం చేస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మాచారం చేర‌వేశారు. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం తిరుప‌తి ఉప ఎన్నిక అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టింది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు రాసిన లేఖ‌లు, సాక్ష్యాల‌ను కూడా బుట్ట‌దాఖ‌లు చేసిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల నుంచి టీడీపీ నేత‌ల‌కు స‌మాచారం వ‌చ్చింది.

దీంతో ఇప్పుడు టీడీపీ నేత‌ల మ‌ధ్య మే-2 ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. ఆ రోజు.. తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం రానుంది. ఆ రోజు ఎన్నిక‌ల్లో క‌నుక టీడీపీకి ఘోర‌మైన ప‌రాజ‌యం వ‌స్తే.. ఏం చేయాలి? ఏవిధంగా ఎదురు దాడికి సిద్ధ‌మవ్వాలి? అనే విష‌యంపై స‌మాలోచ‌న చేస్తున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల నుంచి స‌మాచారం. అయితే.. ఇప్ప‌టికిప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోయినా.. ప్ర‌స్తుతం బీజేపీ అభ్య‌ర్థి ర‌త్న ప్ర‌భ ఎలాగూ హైకోర్టులో పిటిష‌న్ వేసిన నేప‌థ్యంలో తాము కూడా ఇంప్లీడ్ అయి.. స‌ద‌రు సాక్ష్యాధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పిస్తే.. జ‌గ‌న్ స‌ర్కారును ఇరుకున పెట్టిన‌ట్టు అవుతుంద‌ని ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. దీనిపై ఒక‌టి రెండు రోజుల్లోనే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు విన‌తిని కోర్టు ఏమేర‌కు ప‌రిష్క‌రిస్తుందో చూడాలి.

Satya

Recent Posts

ఏషియ‌న్ సునీల్‌పై నాగ‌వంశీ రివెంజ్?

టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కున్న పాపులారిటీనే వేరు. ప్ర‌స్తుతం…

36 minutes ago

రామాయ‌ణ పై ముందే చేతులెత్తేసిన కాజ‌ల్

స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో న‌టించిన‌పుడు వారి ఇమేజ్‌కు త‌గ్గ పాత్ర‌లు లేక‌పోతే.. అభిమానులు ఫీల‌వ‌డం…

2 hours ago

టీడీపీ, జనసేనల మైత్రి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది…?

ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…

2 hours ago

మావిగనా?… మాయా జగనా..?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…

4 hours ago

అంత అత్యాశ ఎందుకు ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…

11 hours ago

అవమానంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ‘అల్ఫా’

మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…

11 hours ago