Political News

బాబు విన్న‌పాలు బుట్ట‌దాఖ‌లు.. మే 2 కోసం వెయిటింగ్‌

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర ఆలోచ‌న చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప‌ట్టు సాధించాల‌ని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. దీంతో చిత్తూరు జిల్లాపై కాన్‌స‌న్ ‌ట్రేట్ చేశారు. ఈ క్ర‌మంలోనే తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో చిత్తూరు జిల్లా ప‌రిధిలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో లోకేష్‌ను బ‌లంగా ప్ర‌చారానికి దింపారు. ఇంతా చేస్తే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి దొంగ వోట్ల క‌ల‌క‌లం రేగింది. అధికార పార్టీ నేత‌లే దొంగో ఓట్లు వేయించారంటూ.. బ‌స్సుల్లో జ‌నాల‌ను త‌ర‌లించారంటూ.. చంద్ర‌బాబు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. వీడియోలు సేక‌రించారు. ఫోన్ సంభాష‌ణ‌ల ఆడియోల‌ను సాక్ష్యాలుగా చూపిస్తూ..తిరుప‌తిలో జ‌రిగిన ఎన్నిక‌ను ర‌ద్దు చేసి రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. ఆయా సాక్ష్యాల వీడియోలు, ఆడియోల‌ను కూడా పంపించారు. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌ధానాధికారి విజ‌యానంద్ కూడా నివేదిక‌లు ఇచ్చారు. అయితే.. వీరు ఇచ్చిన నివేదిక‌ల్లో మాత్రం అంతా స‌వ్యంగానే సాగింద‌ని.. ఇక్క‌డ ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. దొంగ వోట్లు వేసే అవ‌కాశం కూడా లేద‌ని వారు స్ప‌ష్టం చేస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మాచారం చేర‌వేశారు. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం తిరుప‌తి ఉప ఎన్నిక అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టింది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు రాసిన లేఖ‌లు, సాక్ష్యాల‌ను కూడా బుట్ట‌దాఖ‌లు చేసిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల నుంచి టీడీపీ నేత‌ల‌కు స‌మాచారం వ‌చ్చింది.

దీంతో ఇప్పుడు టీడీపీ నేత‌ల మ‌ధ్య మే-2 ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. ఆ రోజు.. తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం రానుంది. ఆ రోజు ఎన్నిక‌ల్లో క‌నుక టీడీపీకి ఘోర‌మైన ప‌రాజ‌యం వ‌స్తే.. ఏం చేయాలి? ఏవిధంగా ఎదురు దాడికి సిద్ధ‌మవ్వాలి? అనే విష‌యంపై స‌మాలోచ‌న చేస్తున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల నుంచి స‌మాచారం. అయితే.. ఇప్ప‌టికిప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోయినా.. ప్ర‌స్తుతం బీజేపీ అభ్య‌ర్థి ర‌త్న ప్ర‌భ ఎలాగూ హైకోర్టులో పిటిష‌న్ వేసిన నేప‌థ్యంలో తాము కూడా ఇంప్లీడ్ అయి.. స‌ద‌రు సాక్ష్యాధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పిస్తే.. జ‌గ‌న్ స‌ర్కారును ఇరుకున పెట్టిన‌ట్టు అవుతుంద‌ని ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. దీనిపై ఒక‌టి రెండు రోజుల్లోనే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు విన‌తిని కోర్టు ఏమేర‌కు ప‌రిష్క‌రిస్తుందో చూడాలి.

This post was last modified on April 23, 2021 12:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాయమైన వైవీఎస్.. మళ్లీ వచ్చారు

టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…

8 hours ago

మహాభారతం పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారా

ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…

9 hours ago

యుద్ధం వద్దంటున్న తెలుగు హీరోయిన్

కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…

9 hours ago

మే 30 వదిలేయడం లాభమా నష్టమా

నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…

10 hours ago

ఇస్రో కేంద్రాలు, పోర్టుల వద్ద హై అలర్ట్

పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…

10 hours ago

పాక్ ది ఎంతటి పన్నాగమో తెలుసా..?

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…

10 hours ago