Political News

బాబు విన్న‌పాలు బుట్ట‌దాఖ‌లు.. మే 2 కోసం వెయిటింగ్‌

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర ఆలోచ‌న చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప‌ట్టు సాధించాల‌ని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. దీంతో చిత్తూరు జిల్లాపై కాన్‌స‌న్ ‌ట్రేట్ చేశారు. ఈ క్ర‌మంలోనే తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో చిత్తూరు జిల్లా ప‌రిధిలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో లోకేష్‌ను బ‌లంగా ప్ర‌చారానికి దింపారు. ఇంతా చేస్తే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి దొంగ వోట్ల క‌ల‌క‌లం రేగింది. అధికార పార్టీ నేత‌లే దొంగో ఓట్లు వేయించారంటూ.. బ‌స్సుల్లో జ‌నాల‌ను త‌ర‌లించారంటూ.. చంద్ర‌బాబు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. వీడియోలు సేక‌రించారు. ఫోన్ సంభాష‌ణ‌ల ఆడియోల‌ను సాక్ష్యాలుగా చూపిస్తూ..తిరుప‌తిలో జ‌రిగిన ఎన్నిక‌ను ర‌ద్దు చేసి రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. ఆయా సాక్ష్యాల వీడియోలు, ఆడియోల‌ను కూడా పంపించారు. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌ధానాధికారి విజ‌యానంద్ కూడా నివేదిక‌లు ఇచ్చారు. అయితే.. వీరు ఇచ్చిన నివేదిక‌ల్లో మాత్రం అంతా స‌వ్యంగానే సాగింద‌ని.. ఇక్క‌డ ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. దొంగ వోట్లు వేసే అవ‌కాశం కూడా లేద‌ని వారు స్ప‌ష్టం చేస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మాచారం చేర‌వేశారు. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం తిరుప‌తి ఉప ఎన్నిక అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టింది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు రాసిన లేఖ‌లు, సాక్ష్యాల‌ను కూడా బుట్ట‌దాఖ‌లు చేసిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల నుంచి టీడీపీ నేత‌ల‌కు స‌మాచారం వ‌చ్చింది.

దీంతో ఇప్పుడు టీడీపీ నేత‌ల మ‌ధ్య మే-2 ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. ఆ రోజు.. తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం రానుంది. ఆ రోజు ఎన్నిక‌ల్లో క‌నుక టీడీపీకి ఘోర‌మైన ప‌రాజ‌యం వ‌స్తే.. ఏం చేయాలి? ఏవిధంగా ఎదురు దాడికి సిద్ధ‌మవ్వాలి? అనే విష‌యంపై స‌మాలోచ‌న చేస్తున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల నుంచి స‌మాచారం. అయితే.. ఇప్ప‌టికిప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోయినా.. ప్ర‌స్తుతం బీజేపీ అభ్య‌ర్థి ర‌త్న ప్ర‌భ ఎలాగూ హైకోర్టులో పిటిష‌న్ వేసిన నేప‌థ్యంలో తాము కూడా ఇంప్లీడ్ అయి.. స‌ద‌రు సాక్ష్యాధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పిస్తే.. జ‌గ‌న్ స‌ర్కారును ఇరుకున పెట్టిన‌ట్టు అవుతుంద‌ని ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. దీనిపై ఒక‌టి రెండు రోజుల్లోనే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు విన‌తిని కోర్టు ఏమేర‌కు ప‌రిష్క‌రిస్తుందో చూడాలి.

Satya

Recent Posts

సురేందర్ రెడ్డి సమస్య ఎప్పుడు తీరెనో

దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…

30 minutes ago

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

57 minutes ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

2 hours ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

3 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

4 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

4 hours ago