తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆలోచన చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పట్టు సాధించాలని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. దీంతో చిత్తూరు జిల్లాపై కాన్సన్ ట్రేట్ చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో లోకేష్ను బలంగా ప్రచారానికి దింపారు. ఇంతా చేస్తే.. ఎన్నికల సమయానికి దొంగ వోట్ల కలకలం రేగింది. అధికార పార్టీ నేతలే దొంగో ఓట్లు వేయించారంటూ.. బస్సుల్లో జనాలను తరలించారంటూ.. చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వీడియోలు సేకరించారు. ఫోన్ సంభాషణల ఆడియోలను సాక్ష్యాలుగా చూపిస్తూ..తిరుపతిలో జరిగిన ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆయా సాక్ష్యాల వీడియోలు, ఆడియోలను కూడా పంపించారు. ఇంత వరకుబాగానే ఉన్నా.. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి విజయానంద్ కూడా నివేదికలు ఇచ్చారు. అయితే.. వీరు ఇచ్చిన నివేదికల్లో మాత్రం అంతా సవ్యంగానే సాగిందని.. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని.. దొంగ వోట్లు వేసే అవకాశం కూడా లేదని వారు స్పష్టం చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం చేరవేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి ఉప ఎన్నిక అనే విషయాన్ని పక్కన పెట్టింది. అదే సమయంలో చంద్రబాబు రాసిన లేఖలు, సాక్ష్యాలను కూడా బుట్టదాఖలు చేసినట్టు ఢిల్లీ వర్గాల నుంచి టీడీపీ నేతలకు సమాచారం వచ్చింది.
దీంతో ఇప్పుడు టీడీపీ నేతల మధ్య మే-2 ఫీవర్ పట్టుకుంది. ఆ రోజు.. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రానుంది. ఆ రోజు ఎన్నికల్లో కనుక టీడీపీకి ఘోరమైన పరాజయం వస్తే.. ఏం చేయాలి? ఏవిధంగా ఎదురు దాడికి సిద్ధమవ్వాలి? అనే విషయంపై సమాలోచన చేస్తున్నట్టు టీడీపీ వర్గాల నుంచి సమాచారం. అయితే.. ఇప్పటికిప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ ఎలాగూ హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో తాము కూడా ఇంప్లీడ్ అయి.. సదరు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పిస్తే.. జగన్ సర్కారును ఇరుకున పెట్టినట్టు అవుతుందని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. మరి చంద్రబాబు వినతిని కోర్టు ఏమేరకు పరిష్కరిస్తుందో చూడాలి.
This post was last modified on April 23, 2021 12:25 pm
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…