Political News

షర్మిలకు కరోనా దెబ్బ

అవును షర్మిలను కరోనా వైరస్ సెకెండ్ వేవ్ గట్టి దెబ్బ కొట్టింది. అంటే ఆమెకు కరోనా వైరస్ సోకిందని కాదు అర్ధం. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో మూడు రోజులపాటు షర్మిల దీక్ష నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె దీక్ష ముగియగానే రాష్ట్రవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లోను రిలే నిరాహార దీక్షలు చేయాలని పిలుపిచ్చారు. ఆమె పిలుపుకు సానుకూలంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరుద్యోగులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు దీక్షలకు దిగారు.

అయితే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉందన్న విషయం తెలిసిందే. దీక్షల వల్ల జనాలు ఒకేచోట గుమిగూడటం వల్ల వైరస్ వ్యాప్తి బాగా పెరిగిపోతుందన్న ఉద్దేశ్యంతోనే దీక్షలను వాయిదా వేసుకుంటున్నట్లు షర్మిల ఆఫీసు ఓ ప్రకటన జారీచేసింది. ఇప్పటికే షర్మిల పిలుపు మేరకు చాలా జిల్లాల్లో దీక్షలకు కూర్చున్నారు. వీరికి మద్దతుగా మరికొంతమంది అక్కడే ఉన్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో అంతమంది ఒకేచోట చేరటం ప్రమాదకరమని షర్మిల అభిప్రాయపడినట్లు ప్రెస్ నోట్ స్పష్టంచేసింది.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తమవంతుగా బాధ్యత ఫీలవ్వటం వల్లే దీక్షలను వాయిదా వేసుకోవాలని షర్మిల అందరినీ కోరారు. నిజానికి ఆమెకూడా మూడు రోజుల దీక్షను ఇందిరాపార్కు దగ్గరే చేయాలని అనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగానే పోలీసులు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతించారు. అందుకనే ఒకరోజు ఇందిరా పార్కు దగ్గర మిగిలిన రెండు రోజులు లోటస్ పాండ్ లోని తనింటి దగ్గరే చేశారు. మొత్తానికి ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో షర్మిల చేయాలని అనుకున్న ఆందోళనకు కరోనా వైరస్ గట్టి దెబ్బే కొట్టినట్లయ్యింది.

This post was last modified on April 22, 2021 11:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

1 hour ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

2 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

2 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

5 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago