అవును షర్మిలను కరోనా వైరస్ సెకెండ్ వేవ్ గట్టి దెబ్బ కొట్టింది. అంటే ఆమెకు కరోనా వైరస్ సోకిందని కాదు అర్ధం. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో మూడు రోజులపాటు షర్మిల దీక్ష నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె దీక్ష ముగియగానే రాష్ట్రవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లోను రిలే నిరాహార దీక్షలు చేయాలని పిలుపిచ్చారు. ఆమె పిలుపుకు సానుకూలంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరుద్యోగులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు దీక్షలకు దిగారు.
అయితే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉందన్న విషయం తెలిసిందే. దీక్షల వల్ల జనాలు ఒకేచోట గుమిగూడటం వల్ల వైరస్ వ్యాప్తి బాగా పెరిగిపోతుందన్న ఉద్దేశ్యంతోనే దీక్షలను వాయిదా వేసుకుంటున్నట్లు షర్మిల ఆఫీసు ఓ ప్రకటన జారీచేసింది. ఇప్పటికే షర్మిల పిలుపు మేరకు చాలా జిల్లాల్లో దీక్షలకు కూర్చున్నారు. వీరికి మద్దతుగా మరికొంతమంది అక్కడే ఉన్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో అంతమంది ఒకేచోట చేరటం ప్రమాదకరమని షర్మిల అభిప్రాయపడినట్లు ప్రెస్ నోట్ స్పష్టంచేసింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తమవంతుగా బాధ్యత ఫీలవ్వటం వల్లే దీక్షలను వాయిదా వేసుకోవాలని షర్మిల అందరినీ కోరారు. నిజానికి ఆమెకూడా మూడు రోజుల దీక్షను ఇందిరాపార్కు దగ్గరే చేయాలని అనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగానే పోలీసులు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతించారు. అందుకనే ఒకరోజు ఇందిరా పార్కు దగ్గర మిగిలిన రెండు రోజులు లోటస్ పాండ్ లోని తనింటి దగ్గరే చేశారు. మొత్తానికి ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో షర్మిల చేయాలని అనుకున్న ఆందోళనకు కరోనా వైరస్ గట్టి దెబ్బే కొట్టినట్లయ్యింది.
This post was last modified on April 22, 2021 11:41 am
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…