అవును షర్మిలను కరోనా వైరస్ సెకెండ్ వేవ్ గట్టి దెబ్బ కొట్టింది. అంటే ఆమెకు కరోనా వైరస్ సోకిందని కాదు అర్ధం. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో మూడు రోజులపాటు షర్మిల దీక్ష నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె దీక్ష ముగియగానే రాష్ట్రవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లోను రిలే నిరాహార దీక్షలు చేయాలని పిలుపిచ్చారు. ఆమె పిలుపుకు సానుకూలంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరుద్యోగులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు దీక్షలకు దిగారు.
అయితే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉందన్న విషయం తెలిసిందే. దీక్షల వల్ల జనాలు ఒకేచోట గుమిగూడటం వల్ల వైరస్ వ్యాప్తి బాగా పెరిగిపోతుందన్న ఉద్దేశ్యంతోనే దీక్షలను వాయిదా వేసుకుంటున్నట్లు షర్మిల ఆఫీసు ఓ ప్రకటన జారీచేసింది. ఇప్పటికే షర్మిల పిలుపు మేరకు చాలా జిల్లాల్లో దీక్షలకు కూర్చున్నారు. వీరికి మద్దతుగా మరికొంతమంది అక్కడే ఉన్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో అంతమంది ఒకేచోట చేరటం ప్రమాదకరమని షర్మిల అభిప్రాయపడినట్లు ప్రెస్ నోట్ స్పష్టంచేసింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తమవంతుగా బాధ్యత ఫీలవ్వటం వల్లే దీక్షలను వాయిదా వేసుకోవాలని షర్మిల అందరినీ కోరారు. నిజానికి ఆమెకూడా మూడు రోజుల దీక్షను ఇందిరాపార్కు దగ్గరే చేయాలని అనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగానే పోలీసులు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతించారు. అందుకనే ఒకరోజు ఇందిరా పార్కు దగ్గర మిగిలిన రెండు రోజులు లోటస్ పాండ్ లోని తనింటి దగ్గరే చేశారు. మొత్తానికి ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో షర్మిల చేయాలని అనుకున్న ఆందోళనకు కరోనా వైరస్ గట్టి దెబ్బే కొట్టినట్లయ్యింది.
This post was last modified on April 22, 2021 11:41 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…