Political News

వైజాగ్ గ్యాస్ లీక్.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్

వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతంలో ఓవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌త్వ‌ర స్పంద‌న ప్ర‌శంస‌లందుకుంటుంటే.. దీన్ని హైలైట్ చేసే క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు జ‌గ‌న్‌కు, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయి. గ్యాస్ లీక్ కార‌ణంగా చ‌నిపోయిన మృతుల కుటుంబాల‌కు కోటి రూపాయ‌ల చొప్పున జ‌గ‌న్ భారీ ప‌రిహారం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఐతే ఎంత ప‌రిహారం ప్ర‌కటించినా పోయిన ప్రాణాలు తిరిగి వ‌స్తాయా అంటూ బాధితులు ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతున్నారు.

త‌ట్టుకోలేని బాధ‌తో ఎల్జీ పాలిమ‌ర్స్ ముందు ఆందోళ‌న కూడా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఆ సంద‌ర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మృతుల‌కు రూ.25 ల‌క్ష‌ల పరిహారం ఇస్తేనే ఎక్కువ అని, అలాంటి జ‌గ‌న్ కోటి రూపాయ‌లు ప్ర‌క‌టిస్తే సంతోషించ‌డం పోయి విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంటంటూ చేసిన కామెంట్ విమ‌ర్శ‌ల పాలైంది.

జ‌గ‌న్ ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో భారీ పారితోష‌క‌మే ప్ర‌క‌టించారు. అంత‌మాత్రాన రూ.25 ల‌క్ష‌లే ఎక్కువ అంటూ బాధితుల ప్రాణాల విలువ‌ను త‌క్కువ చేయ‌డం త‌ప్పు.
ఈ కామెంటే త‌ప్పు అంటే.. తాజాగా వైకాపా చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ మ‌రో షాకింగ్ కామెంట్ చేశారు. జ‌గ‌న్ కోటి రూపాయ‌ల పారితోష‌కం ప్ర‌క‌టించ‌డం చూసి.. గ్యాస్ లీక్ ప్ర‌భావిత ప్రాంతాల్లో కొంద‌రు త‌మ కుటుంబంలో ఎవ‌రైనా చ‌నిపోయి కోటి రూపాయ‌లు త‌మకు ప‌రిహారం వ‌చ్చినా బాగుండేదే అనుకుంటున్నారంటూ ఆయ‌న కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ మాట తాను చెప్ప‌కూడ‌దు అంటూనే అన‌రాని మాట అనేశారు ఎమ్మెల్యే. ఓవైపు బాధితులు కోటి రూపాయ‌లు వెన‌క్కిస్తాం మీరొచ్చి విష‌వాయువు పీల్చండి అని ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతుంటే ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్ చేయ‌డం దారుణం.

This post was last modified on May 13, 2020 11:30 am

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago