వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతంలో ఓవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్వర స్పందన ప్రశంసలందుకుంటుంటే.. దీన్ని హైలైట్ చేసే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు జగన్కు, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయి. గ్యాస్ లీక్ కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున జగన్ భారీ పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఎంత పరిహారం ప్రకటించినా పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ బాధితులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
తట్టుకోలేని బాధతో ఎల్జీ పాలిమర్స్ ముందు ఆందోళన కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మృతులకు రూ.25 లక్షల పరిహారం ఇస్తేనే ఎక్కువ అని, అలాంటి జగన్ కోటి రూపాయలు ప్రకటిస్తే సంతోషించడం పోయి విమర్శలు చేయడం ఏంటంటూ చేసిన కామెంట్ విమర్శల పాలైంది.
జగన్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ పారితోషకమే ప్రకటించారు. అంతమాత్రాన రూ.25 లక్షలే ఎక్కువ అంటూ బాధితుల ప్రాణాల విలువను తక్కువ చేయడం తప్పు.
ఈ కామెంటే తప్పు అంటే.. తాజాగా వైకాపా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరో షాకింగ్ కామెంట్ చేశారు. జగన్ కోటి రూపాయల పారితోషకం ప్రకటించడం చూసి.. గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో కొందరు తమ కుటుంబంలో ఎవరైనా చనిపోయి కోటి రూపాయలు తమకు పరిహారం వచ్చినా బాగుండేదే అనుకుంటున్నారంటూ ఆయన కామెంట్ చేయడం గమనార్హం.
ఈ మాట తాను చెప్పకూడదు అంటూనే అనరాని మాట అనేశారు ఎమ్మెల్యే. ఓవైపు బాధితులు కోటి రూపాయలు వెనక్కిస్తాం మీరొచ్చి విషవాయువు పీల్చండి అని ఆక్రోశం వెళ్లగక్కుతుంటే ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్ చేయడం దారుణం.
This post was last modified on May 13, 2020 11:30 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…