Political News

మోడీలోని విఫల నేతను చూపించిన కరోనా?


కొందరికి కొన్ని భలేగా అచ్చి వస్తాయి. ఎందుకని చెప్పలేం కానీ.. ఇలా కలిసి వచ్చే అంశాలు ఉన్నట్లే.. ఏ మాత్రం అచ్చిరాని అంశాలు ఉంటాయి. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. కోట్లాది ప్రజల్ని ప్రభావితం చేసే రాజకీయ రంగం మీద ఇలాంటి సెంటిమెంట్లు మహా బాగా పని చేస్తుంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతే చూడండి.. ఆయనకు లక్కీ నెంబరు “6”… ఆరుతో ఏం చేసినా ఆయనకు లాభం జరిగేలా చేస్తుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయనకు “23” అస్సలు అచ్చి రాదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

ఇందుకు భిన్నంగా ప్రధాని మోడీకి అచ్చి వచ్చింది.. అచ్చిరానిది ఏమైనా ఉందంటే అది కరోనానే. ఒకే అంశంలో అటు ఇమేజ్ ను అదే సమయంలో డ్యామేజ్ ను తెచ్చుకోవటం మోడీకే సాధ్యమని చెప్పాలి. కరోనా ఫస్ట్ వేవ్ వేళ.. ప్రపంచంలో మరే దేశం తీసుకోనంత వేగంగా లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించి.. కేసుల పెరుగుదలకు చెక్ పెట్టేశారు. అంతేనా.. మధ్య మధ్యలో భావోద్వేగ అంశాల్ని తీసుకొచ్చి.. యావత్ దేశం మొత్తం దీపాలు వెలిగించేలా.. గంటలు కొట్టేలా.. ఒక రోజంతా ఇంట్లో నుంచి రాకుండా చేయటమే కాదు.. తాను టీవీ స్క్రీన్ మీదకు వచ్చి ఏమైనా చెబితే చాలు.. 135 కోట్ల మంది ఇట్టే ఫాలో అయ్యేలా చేసే మేజిక్ మోడీ సొంతమన్న ఇమేజ్ తెచ్చుకున్నారు.

కరోనా విషయంలో ఇంత ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. వలస కూలీల ఎపిసోడ్ లో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించటం.. శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసే విషయంలో ఆయన అనుసరించిన విధానం.. కేంద్రం తీరుతో తమ ఇళ్లకు వెళ్లేందుకు వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన బడుగు జీవుల ఎపిసోడ్.. మోడీలోని ‘పాలకుడి’ మీద అనుమానాలు వ్యక్తమయ్యేలా చేసింది.

కట్ చేస్తే.. మొదటి దశ ముగిసి.. రెండో దశ ఎంట్రీలోనే ఆయన్ను కరోనా తెగ దెబ్బేసింది. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి.. మిగిలిన విషయాల్ని పట్టించుకోనట్లుగా వ్యవహరించిన తీరుకు.. ఈ రోజున యావత్ భారత జాతి కరోనాకు ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వస్తోంది. వ్యాక్సిన్ విషయంలో మోడీ తీసుకోవాల్సిన నిర్ణయాల్ని ఆయన తాజాగా ప్రకటించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ రోజున మహారాష్ట్ర.. గుజరాత్.. ఉత్తర ప్రదేశ్.. పంజాబ్ రాష్ట్రాలతో పాటు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం భారీగా ఉందని చెప్పాలి. ఇలా.. ఒకే అంశం ప్రధాని మోడీ ఇమేజ్ ను అమాంతం పెంచేయటమే కాదు.. తీవ్ర విమర్శలకు.. మాసిపోని మరకగా నిలిచిపోయిందని చెప్పాలి.

This post was last modified on April 20, 2021 9:08 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

11 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

12 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

16 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

16 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

16 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

17 hours ago