Political News

తిరుప‌తి వైసీపీకి క‌ష్ట‌మే… రీజ‌న్లు ఇవే ?

ఏపీలో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌పై వైసీపీ నేత‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ నూటికి నూరు శాతం ఫ‌లితాలు ( తాడిప‌త్రి మిన‌హా) సాధించింది. ఈ ఊపులో తిరుప‌తిలో తిరుగులేని మెజార్టీ సాధించి త‌మ స‌త్తాను ఢిల్లీ స్థాయిలో చాటుకోవాల‌ని ఆ పార్టీ అధిష్టానం ఉబ‌లాట ప‌డిన మాట వాస్త‌వం. ఈ ఉప ఎన్నిక‌ను బీజేపీ కూడా చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో బీజేపీకే త‌మ అస‌లు సిస‌లు దెబ్బేంటో చూపించాల‌ని వైసీపీ డిసైడ్ అయ్యింది. ఇక బీజేపీ టీడీపీని మూడో ప్లేస్‌లోకి నెట్టేసి.. రెండో స్థానంలో నిలిచి వైసీపీకి అస‌లు సిస‌లు ప్ర‌త్య‌ర్థి తామే అని చూపించుకోవాల‌ని ఇక్క‌డ క‌సితోనే ప‌ని చేసింది.

ఇక ఎన్నిక‌ల హ‌డావిడి ముందు వ‌ర‌కు 3 ల‌క్ష‌ల మెజార్టీ అంటూ బాకాలు ఊదుకున్న వైసీపీ నేత‌లు.. చివ‌ర‌కు పోలింగ్ ముందు నాటికి 5 ల‌క్ష‌ల మెజార్టీ టార్గెట్ అంటూ ఒక్క‌టే హ‌డావిడి చేశారు. అయితే పోలింగ్ ముగిశాక వైసీపీ వాళ్ల మొహాలు మాడిపోయాయి. తిరుపతిలో మెజారిటీపై వైసీపీ నేతలు పెట్టుకున్న ఆశలు ఫలించేట్లు లేవు. దీనికి ప్రధాన కారణం తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడమే. జ‌గ‌న్ స్వ‌యంగా ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అక్క‌డితో ఆగ‌కుండా ఆయ‌న ఏకంగా 5 ల‌క్ష‌ల మెజార్టీ రావాల‌ని వాళ్ల‌కు టార్గెట్ పెట్టారు.

తీరా పోలింగ్ స‌ర‌ళి చూశాక‌.. 5 ల‌క్ష‌లు మెజార్టీ కాదు క‌దా.. 3 ల‌క్ష‌లు.. ఇంకా చెప్పాలంటే 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 2.28 ల‌క్ష‌ల మెజార్టీ అయినా వ‌స్తుందా ? అన్న సందేహాలు వైసీపీ వాళ్ల‌లోనే తీవ్రంగా ఉన్నాయి. జ‌గ‌న్ సైతం 5 ల‌క్ష‌ల మెజార్టీతో బీజేపీ ఢిల్లీ నాయ‌క‌త్వానికి కూడా త‌మ ద‌మ్మేంటో చూపాల‌నే అనుకున్నారు. అయితే పోలింగ్ శాతం ఈ ఉత్సాహం మీద నీళ్లు చ‌ల్లేసింది. ఇక్క‌డ 2019 ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్ నమోదయింది. అప్పుడు 13 ల‌క్ష‌ల ఓట్లు ఉంటే వైసీపీ నుంచి గెలిచిన దుర్గా ప్ర‌సాద్‌కు 2.28 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది.

ఇప్పుడు మొత్తం 17 ల‌క్ష‌ల ఓట్లు ఉంటే 63 శాతం పోలింగ్ మాత్ర‌మే న‌మోదు అయ్యింది. అంటే 10 ల‌క్ష‌ల ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. ట్ర‌యాంగిల్ ఫైట్‌లో టీడీపీ కూడా అంచ‌నాల‌కు మించి గ‌ట్టి పోటీ ఇచ్చింద‌నే అంటున్నారు. ఇక బీజేపీకి ప‌డే ఓట్లు కూడా తీసేస్తే వైసీపీ 2019లో వ‌చ్చిన మెజార్టీ తెచ్చుకుంటే గొప్పే అంటున్నారు. ఏదేమైనా ఓట‌ర్ల ఆనాస‌క్త‌త వైసీపీ ఆశ‌ల‌పై నీళ్లు కుమ్మ‌రించేసింది.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

4 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

7 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

7 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

9 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

11 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

12 hours ago