Political News

తిరుప‌తి వైసీపీకి క‌ష్ట‌మే… రీజ‌న్లు ఇవే ?

ఏపీలో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌పై వైసీపీ నేత‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ నూటికి నూరు శాతం ఫ‌లితాలు ( తాడిప‌త్రి మిన‌హా) సాధించింది. ఈ ఊపులో తిరుప‌తిలో తిరుగులేని మెజార్టీ సాధించి త‌మ స‌త్తాను ఢిల్లీ స్థాయిలో చాటుకోవాల‌ని ఆ పార్టీ అధిష్టానం ఉబ‌లాట ప‌డిన మాట వాస్త‌వం. ఈ ఉప ఎన్నిక‌ను బీజేపీ కూడా చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో బీజేపీకే త‌మ అస‌లు సిస‌లు దెబ్బేంటో చూపించాల‌ని వైసీపీ డిసైడ్ అయ్యింది. ఇక బీజేపీ టీడీపీని మూడో ప్లేస్‌లోకి నెట్టేసి.. రెండో స్థానంలో నిలిచి వైసీపీకి అస‌లు సిస‌లు ప్ర‌త్య‌ర్థి తామే అని చూపించుకోవాల‌ని ఇక్క‌డ క‌సితోనే ప‌ని చేసింది.

ఇక ఎన్నిక‌ల హ‌డావిడి ముందు వ‌ర‌కు 3 ల‌క్ష‌ల మెజార్టీ అంటూ బాకాలు ఊదుకున్న వైసీపీ నేత‌లు.. చివ‌ర‌కు పోలింగ్ ముందు నాటికి 5 ల‌క్ష‌ల మెజార్టీ టార్గెట్ అంటూ ఒక్క‌టే హ‌డావిడి చేశారు. అయితే పోలింగ్ ముగిశాక వైసీపీ వాళ్ల మొహాలు మాడిపోయాయి. తిరుపతిలో మెజారిటీపై వైసీపీ నేతలు పెట్టుకున్న ఆశలు ఫలించేట్లు లేవు. దీనికి ప్రధాన కారణం తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడమే. జ‌గ‌న్ స్వ‌యంగా ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అక్క‌డితో ఆగ‌కుండా ఆయ‌న ఏకంగా 5 ల‌క్ష‌ల మెజార్టీ రావాల‌ని వాళ్ల‌కు టార్గెట్ పెట్టారు.

తీరా పోలింగ్ స‌ర‌ళి చూశాక‌.. 5 ల‌క్ష‌లు మెజార్టీ కాదు క‌దా.. 3 ల‌క్ష‌లు.. ఇంకా చెప్పాలంటే 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 2.28 ల‌క్ష‌ల మెజార్టీ అయినా వ‌స్తుందా ? అన్న సందేహాలు వైసీపీ వాళ్ల‌లోనే తీవ్రంగా ఉన్నాయి. జ‌గ‌న్ సైతం 5 ల‌క్ష‌ల మెజార్టీతో బీజేపీ ఢిల్లీ నాయ‌క‌త్వానికి కూడా త‌మ ద‌మ్మేంటో చూపాల‌నే అనుకున్నారు. అయితే పోలింగ్ శాతం ఈ ఉత్సాహం మీద నీళ్లు చ‌ల్లేసింది. ఇక్క‌డ 2019 ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్ నమోదయింది. అప్పుడు 13 ల‌క్ష‌ల ఓట్లు ఉంటే వైసీపీ నుంచి గెలిచిన దుర్గా ప్ర‌సాద్‌కు 2.28 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది.

ఇప్పుడు మొత్తం 17 ల‌క్ష‌ల ఓట్లు ఉంటే 63 శాతం పోలింగ్ మాత్ర‌మే న‌మోదు అయ్యింది. అంటే 10 ల‌క్ష‌ల ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. ట్ర‌యాంగిల్ ఫైట్‌లో టీడీపీ కూడా అంచ‌నాల‌కు మించి గ‌ట్టి పోటీ ఇచ్చింద‌నే అంటున్నారు. ఇక బీజేపీకి ప‌డే ఓట్లు కూడా తీసేస్తే వైసీపీ 2019లో వ‌చ్చిన మెజార్టీ తెచ్చుకుంటే గొప్పే అంటున్నారు. ఏదేమైనా ఓట‌ర్ల ఆనాస‌క్త‌త వైసీపీ ఆశ‌ల‌పై నీళ్లు కుమ్మ‌రించేసింది.

This post was last modified on April 19, 2021 11:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

2 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

4 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

11 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

12 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

12 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

14 hours ago