Political News

కియా రీస్టార్ట్.. గంటకు 30 కార్లు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ స్టేటస్ ఎలా ఉన్నప్పటికీ.. పనులు మాత్రం మొదలైపోయాయి. పరిశ్రమలకు కొన్ని రోజుల కిందటే అనుమతులు ఇవ్వడం, పాక్షికంగా పనులు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించడంతో చాలా ఇండస్ట్రీలు రీస్టార్ట్ అయ్యాయి. తాజాగా ప్రతిష్టాత్మక కియా కార్ల సంస్థలోనూ పనులు పున:ప్రారంభమయ్యాయి.

అనంతపురంలో జిల్లాలో చంద్రబాబు సర్కారు హయాంలో ఏర్పాటైన ఈ పరిశ్రమ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత అంతా సెట్ రైట్ అయింది. లాక్ డౌన్ కారణంగా ఈ పరిశ్రమ దాదాపు రెండు నెలలుగా మూసి ఉంది. మంగళవారం పరిశ్రమలో పనులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో పరిశ్రమలో 4500 మంది పని చేస్తుండగా.. ప్రస్తుతం మొత్తం అందరితోనూ పనులు చేపట్టే అవకాశం లేకపోవడంతో సంఖ్య తగ్గించారు.

కేవలం వెయ్యి మందితోనే యాజమాన్యం ఉత్పత్తిని పున:ప్రారంభించింది. కియాలో ఒకప్పుడు గంటలకు 50 కార్లు ఉత్పత్తి అయ్యేవి. ఐతే సిబ్బంది నాలుగో వంతు కన్నా తగ్గినప్పటికీ కార్ల ఉత్పత్తి ఆ స్థాయిలో తగ్గలేదు. ప్రస్తుతం గంటకు 30 కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో మొత్తం పరిశ్రమను శానిటైజ్ చేసి.. కార్మికులు మాస్కులు, గ్లౌజులు తొడుక్కుని భౌతిక దూరం పాటిస్తూ పనులు సాగిస్తున్నారు.

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కార్లను చెన్నై నుంచి ఓడరేవు ద్వారా శ్రీలంకకు ఎగుమతి చేస్తున్నట్లు కియా ప్రతినిధులు తెలిపారు. బాబు హయాంలో ఏపీకి వచ్చిన అతి పెద్ద పరిశ్రమ కియానే. నిరుడు జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో పరిశ్రమను ఇక్కడి నుంచి తమిళనాడుకు తరలించబోతున్నట్లు గట్టి ప్రచారం జరిగింది. కానీ తర్వాత అదేమీ లేదని ఈ దక్షిణ కొరియా సంస్థ ప్రకటించింది.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

37 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

39 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

1 hour ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago