ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ స్టేటస్ ఎలా ఉన్నప్పటికీ.. పనులు మాత్రం మొదలైపోయాయి. పరిశ్రమలకు కొన్ని రోజుల కిందటే అనుమతులు ఇవ్వడం, పాక్షికంగా పనులు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించడంతో చాలా ఇండస్ట్రీలు రీస్టార్ట్ అయ్యాయి. తాజాగా ప్రతిష్టాత్మక కియా కార్ల సంస్థలోనూ పనులు పున:ప్రారంభమయ్యాయి.
అనంతపురంలో జిల్లాలో చంద్రబాబు సర్కారు హయాంలో ఏర్పాటైన ఈ పరిశ్రమ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత అంతా సెట్ రైట్ అయింది. లాక్ డౌన్ కారణంగా ఈ పరిశ్రమ దాదాపు రెండు నెలలుగా మూసి ఉంది. మంగళవారం పరిశ్రమలో పనులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో పరిశ్రమలో 4500 మంది పని చేస్తుండగా.. ప్రస్తుతం మొత్తం అందరితోనూ పనులు చేపట్టే అవకాశం లేకపోవడంతో సంఖ్య తగ్గించారు.
కేవలం వెయ్యి మందితోనే యాజమాన్యం ఉత్పత్తిని పున:ప్రారంభించింది. కియాలో ఒకప్పుడు గంటలకు 50 కార్లు ఉత్పత్తి అయ్యేవి. ఐతే సిబ్బంది నాలుగో వంతు కన్నా తగ్గినప్పటికీ కార్ల ఉత్పత్తి ఆ స్థాయిలో తగ్గలేదు. ప్రస్తుతం గంటకు 30 కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో మొత్తం పరిశ్రమను శానిటైజ్ చేసి.. కార్మికులు మాస్కులు, గ్లౌజులు తొడుక్కుని భౌతిక దూరం పాటిస్తూ పనులు సాగిస్తున్నారు.
ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కార్లను చెన్నై నుంచి ఓడరేవు ద్వారా శ్రీలంకకు ఎగుమతి చేస్తున్నట్లు కియా ప్రతినిధులు తెలిపారు. బాబు హయాంలో ఏపీకి వచ్చిన అతి పెద్ద పరిశ్రమ కియానే. నిరుడు జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో పరిశ్రమను ఇక్కడి నుంచి తమిళనాడుకు తరలించబోతున్నట్లు గట్టి ప్రచారం జరిగింది. కానీ తర్వాత అదేమీ లేదని ఈ దక్షిణ కొరియా సంస్థ ప్రకటించింది.
This post was last modified on May 13, 2020 9:28 am
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…