Political News

తిరుప‌తి ఉప పోరు: టీడీపీది ద‌య‌నీయ ప‌రిస్థితి!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి శ‌నివారం జ‌రిగిన ఉప ఎన్నిక‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి పెద్ద దెబ్బ‌గా మారే ప‌రిస్తితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో అధికార పార్టీ వైసీపీ త‌న విశ్వ‌రూ పం చూపించిందంటూ.. టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు మాత్రం.. టీడీపీ ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో 38శాతం ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు.. తిరుప‌తి ఉప పోరుకు వ‌చ్చే స‌రికి 28శాతంక‌న్నా.. త‌గ్గిపోతుంద‌ని ఎగ్జిట్ పోల్‌లో స్ప‌ష్ట‌మైంది.

2019లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ 23 అసెంబ్లీ స్థానాల‌ను నిల‌బెట్టుకుంది. ఈ క్ర‌మంలో పార్టీకి ద‌క్కిన ఓటు షేర్‌.. 39శాతం. ఇక‌, అప్ప‌టి నుంచి ఓటు బ్యాంకు పెంచుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ.. సాధ్యం కావ‌డం లేదు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను చివ‌రి నిముషంలో చంద్ర‌బాబు బ‌హిష్క‌రించారు. అయిన‌ప్ప‌టికీ.. చాలా చోట్ల టీడీపీ నాయ‌కులు పోటీ చేశారు. ఇదో చిత్ర‌మై న ప‌రిస్థితి. అయితే.. కోర్టు కేసుల కారణంగా ఫ‌లితం ఇంకా వెలువ‌డ‌లేదు. కానీ, ఈలోగా తిరుప‌తి ఉప ఎన్నిక జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఓటు షేర్ మాత్రం బాగా ప‌డిపోయింద‌ని ఎగ్జిట్ పోల్ స్ప‌ష్టం చేసింది.

పార్టీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌.. ఇద్ద‌రూ కూడా సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. ఇది ఆశించిన మేర‌కు ఫ‌లితం ఇవ్వ‌డం లేదు. పైగా ఓటు బ్యాంకుపై దృష్టి పెట్ట‌డం లేదు. ఇక‌, ఇప్పటికైనా చంద్ర‌బాబు ప‌ద్ధ‌తి మార్చుకుని.. 2024 ఎన్నిక‌ల‌కు ముందుగానే జ‌గ‌న్‌పై రాజ‌కీయాలు చేయాల‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.  ఇదిలావుంటే, అధికార పార్టీ తిరుప‌తిలో 64% ఓట్లు త‌మ‌కే ద‌క్కుతాయ‌ని భావిస్తోంది. వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తికి ఇది భారీ విజ‌య‌మేన‌ని భావిస్తున్నారు.

ఇక‌, ఆది నుంచి తిరుప‌తి ఉప పోరును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీకి.. ఇక్క‌డ భారీ ఎదురు దెబ్బ త‌గిలే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 6-7శాతం ఓట్లే ప‌డ‌తాయ‌ని అంచ‌నావేస్తున్నారు. ఇవి కూడా జ‌న‌సేన వ‌ర్గాల నుంచి ప‌డుతున్న‌వేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో జ‌న‌సేనకు బీజేపీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవ‌డం త‌ప్ప మిగిలింది ఏమీ లేదు. ఒక‌వేళ బీజేపీకి జ‌న‌సేన‌ మ‌ద్ద‌తు క‌నుక లేకపోతే.. 3శాతం ఓటు బ్యాంకే ద‌క్కుతుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.  

This post was last modified on April 18, 2021 3:09 pm

Share

Recent Posts

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

32 minutes ago

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

2 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

3 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

3 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

3 hours ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

4 hours ago